వైద్యురాలు ప్రియాంక రెడ్డికి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రియాంక రెడ్డి ని నలుగురు నిందితులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి తలపెట్టిన ఘటనతో ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం ప్రజానీకం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచార హత్యాకాండకు మరి కొన్ని గగుర్పాటు గొలిపే నిజాలు బయటికొచ్చాడు. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియాంక రెడ్డి స్కూటీ వెనక టైరు పంచర్ చేసిన నిందితులు... అనంతరం ప్రియాంక రెడ్డి వచ్చి స్కూటీని చూసిన తర్వాత పంచర్ చేయిస్తానని స్కూటీని తీసుకెళ్ళిన నిందితుల కోసం బాధితురాలు ప్రియాంక రెడ్డి వేచి చూస్తుంది... కానీ ఇంతలో మిగతా నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్ లు బలవంతంగా నిర్మానుష్య ప్రదేశంలో లాక్కెళ్లారు .
వాళ్లు నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రియాంక రెడ్డి ఆ తర్వాత షాక్ నుంచి తేరుకొని హెల్ప్ హెల్ప్ అని అరిచింది . వాహనాల సౌండ్ కారణంగా ప్రియాంక రెడ్డి అరుపులు ఎవ్వరికి వినిపించలేదు. కాగా ముగ్గురు నిందితులు ప్రియాంక రెడ్డిని నోరు నొక్కి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళగా.. కాసేపటికే స్కూటీ తీసుకెళ్లిన నిందితుడు కూడా వారితో కలిసి అత్యాచారానికి యత్నించాడు. అప్పటికి పూర్తిగా మద్యం మత్తులో ఉన్న నలుగురు నిందితులు బాధితురాలిని ప్రియాంక రెడ్డి అరవకుండా ఉండేందుకు బలవంతంగా ఆమె నోరు తెరిచి మద్యం పోసారు. దాదాపు ప్రియాంక రెడ్డిని 45 నిమిషాల పాటు చిత్రహింసలకు గురిచేసి... అనంతరం ప్రియాంక రెడ్డి అరవకుండా ముక్కు నోరు ముగియడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అయితే పోలీసుల విచారణలో తేలిన గగుర్పాటుకు గురి చేసే మరో విషయం బయటకు వచ్చింది. ప్రియాంక రెడ్డి చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని లారీలలో తరలిస్తున్న క్రమంలోనే నిందితులు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలో... మృతదేహానికి ప్యాంట్ లేదని ఆ తర్వాత ఓ నిందితుడు కిందికెల్లి ఫ్యాన్ట్ తెచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు లోదుస్తులు పర్సులు చెప్పులు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని లారీలో 27 కిలోమీటర్ల వరకు తరలించి అక్కడే పెట్రోల్ పోసి తగులబెట్టారు నిందితులు.