కాసే చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్లుగా ఉంది ఏపీలో పాలనా? ఎందుకంటే ఒకరిమీద ఒకరు నిందలేసుకుంటూ జరిగే అభివృద్దిని మరచి ప్రవరిస్తునారని ఇప్పటికే కొందరు అనుకుంటుండగా తాజాగా చంద్రబాబు చేసిన వాఖ్యలూ దుమారాన్ని రేపుతున్నాయి. అదేమంటే  ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

జగన్ పాలన సరిగా లేదని.. అంతా అప్పులు చేస్తున్నారని.. పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలంటూ చురకలంటించారు.  6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం అన్నారు చంద్రబాబు. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి తననే ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

 

 

ఇటు తండ్రితో పాటుగా తనయుడు కూడు నారా లోకేష్ కూడా స్పందించారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. వైకాపా ఆరు నెలల పాలన విధ్వంసంతో ప్రారంభం అయి ప్రస్తుతం సూసైడ్ ప్రదేశ్ గా మారిందంటూ ఎద్దేవా చేసాడు. ఇకపోతే ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తా అని చెప్పిన జగన్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాట మార్చి ప్రజల నెత్తిన నవరత్న తైలం రాసారు అంటూ ఘాటు ట్వీట్‌లు చేశారు.

 

 

ఇకపోతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయ్యింది. ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన తర్వాత ఈ ఆరు నెలల పాలనలో నవరత్నాలతో పాటూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా సరికొత్త, సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఇవాళ్టితో ఆరు నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రతి పక్షాలు ఇలాంటి వాఖ్యలు చేయడం కొందరు నాయకులకు, ఏపీ ప్రజలకు నచ్చడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: