శంషాబాద్‌కి చెందిన వెటర్నరీ వైద్యురాలి దారుణ హత్యపై ఇప్పటికే మనసున్న సామాన్య జనంతో పాటుగా, చిత్రపరిశ్రమ మొత్తం స్పందిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ విషయంలో ఇదివరకే ఘాటుగా స్పందించిన నటి పూనమ్ మరోసారి స్పందించారు.

 

 

ఈ సారి చాలా వివాదస్పదంగా ఆవేదన భరితంగా మాట్లాడుతూ ఆ దొంగనా  నిందితులను తానే చంపి జైలుకి వెళతానంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి సమాజంలో ఉండటం కంటే అడవుల్లో నివసించడం మంచిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఇప్పటికే ఈ వార్తలు అన్ని ఛానెల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఓ మహిళ సాయం కోసం నడి రోడ్డుపై ఎదురుచూస్తుంటే ఆ నలుగురు ల**కో ** ఆమెకు మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లి రేప్ చేసి నిప్పు పెట్టి దారుణంగా చంపేశారు.

 

 

ఇకపోతే ఆ తల్లిదండ్రులకు తమకూతురూ ఇంతవరకు రాకపోవడానికి కారణం తెలియదు. ఇలాంటి సమయంలో పోలీసులు కొంచెం త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. ఇకపోతే నేరస్దుల పై  ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఎదురుచూడాలి. అంత వరకు నేను ఆగలేను ఇప్పుడే అనుమతి ఇస్తే ఆ జంతువులను చంపి జైలుకి వెళ్లాలని ఉంది. వారు జైలులో శిక్ష అనుభవించడం ముఖ్యం కాదు. కావాలంటే నేనే వారిని చంపి జైలుకి వెళ్తా. ఇలాంటి వారి విషయంలో ఆలస్యం చేయకూడదు.

 

 

ఇకపోతే దేశంలో జరుగుతున్న ఈ రేప్‌లను అరికట్టడానికి పరిష్కారం ఏంటి? అని ఆలోచించండి కానీ ఇలాంటి సంఘటనలను రాజకీయం మాత్రం చేయకండి. ఇక ఇప్పటికే ఈ రేప్ సంఘటనలతో నేను విసిగిపోయాను. బాధితుల గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఆ నలుగురు ల***లను చంపేయాలని ఉంది. రేపిస్ట్‌లను చంపడం నేరమైతే ఆ నేరం నేను చేయడానికి సిద్ధమే. పరిష్కారాలను ఆలోచించండి. రాజకీయం చేయాలని చూడకండి’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు పూనమ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: