జబర్దస్త్ షోలో సినెమాలపైనా, రాజకీయాల మీద పంచులు వేయడం సర్వసాధారణం. గతంలో హైపర్ ఆది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలపై కొంచెం అవమానకరమైన పంచులు వేసేవాడు. అలా చేసినందుకు గానూ అతనికి చాలామంది బాగానే చివాట్లు కూడా పెట్టారు. ఆది విషయం వదిలేస్తే... ఇప్పుడు బుల్లి తెర కమల్ హస్సన్ గెట్ అప్ శ్రీను కూడా ఆది లాగానే సమకాలీన రాజకీయాలపై పంచ్ వేసి ఇరకాటంలో పడ్డాడంట.


సాధారణంగా గెట్ అప్ శ్రీను రాజకీయాల జోలికి వెళ్ళడు. కానీ డిసెంబర్ 6న ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో.. సుడిగాలి సుధీర్ స్కిట్ లో.. గెటప్ శ్రీను వేసిన పంచ్ కు జడ్జి స్థానంలోని రోజా షాక్ తిన్నట్లు సమాచారం.

ఆ స్కిట్ లో భాగంగా ఆటో రాంప్రసాద్, 'ఎవర్రా వీడు.. కొత్తగా వచ్చాడు.. అంత ఎక్సట్రాలు చేస్తున్నాడు.. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావురా?' అని గెట్ అప్ శ్రీనుని ప్రశ్నించగా.. 'రాత్రే.. బస్సు ఎక్కి వచ్చాను.. సార్' అని సమాధానం ఇవ్వగానే జడ్జి రోజా జోక్యం చేసుకొని.. 'ఏంటీ ఎర్ర బస్స?' అని అడుగుతుంది.. దాంతో ' కలర్ మార్చేశారు..' అని గెట్ శ్రీను పంచ్ వేస్తాడు.

ఇక ఇది విన్న రోజా లైట్ గా పళ్ళు కొరుకుతూ.. పైకి నవ్వుతూ మిక్సడ్ హాహాభావాలతో గెట్ అప్ శ్రీను వేసిన పంచ్ కు రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత శ్రీను బాగా సైలెంట్ అయిపోతాడు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ జెండా రంగులను వేస్తుందని ప్రతిపక్ష పార్టీల నుంచి ఫుల్ గా ఆరోపణలు వస్తున్నాయి. అయితే గెట్ అప్ శ్రీను దాన్నే ఉద్దేశించి పంచ్ వేసాడని సామజిక మాధ్యమాలలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ నేత రోజా ముందు అలా పంచ్ వేసి బాగా బుక్ అయ్యిపోయాడు శ్రీను.


మరింత సమాచారం తెలుసుకోండి: