గత మూడు రోజులుగా ప్రియాంకరెడ్డి సంఘటన రెండు రాష్ట్రాల ప్రజల గుండెలను పిండేస్తుంది. ఈ ఘటన పై ప్రముఖ యాంకర్, బిజెపి మహిళా నాయకురాలు శ్వేతారెడ్డి మాట్లాడుతూ...చట్టాల చేతుల్లో ఏమీ లేవు, ఎందుకంటే అభయ అన్నారు. నిర్భయ అన్నారు. కానీ వేటికీ భయపడడం లేదు. నిర్భయను చంపేసిన సమయంలో జాతీయ స్ధాయిలో కొవ్వుత్తులతో ర్యాలీని చేశారు. అంతే తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోయారు. ఆరుషి తల్వార్ విషయం ఏమయింది. అలాగే ఆయిషా సంఘటన ఏమయింది. అలాగే ఇటీవలె జరిగిన వరంగల ఉదంతం తొమ్మిది నెలల పసి పాపలో ఏం రెచ్చగొట్టే బాడీ పార్ట్స్ ఉంటాయి. ఆ సెక్స్ అప్పీల్ ఎలా వస్తుంది. మన దేశంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఒక నాలుగు రోజులు దానిపై సోషల్ మీడియాలో అయ్యో అయ్యో అంటూ స్పందించడం తప్పించి వేరే ఏమీ చేయడంలేదు. ఎవ్వరినీ ఎవరూ నిలదీసి అడిగేవాడే లేడు.
ఆ అఘంతకుడు ఆపనికి పూనుకుంటాడు. ఆ ఘటన పై వరంగల్ జిల్లా జడ్జి ఉరి తియ్యాలని తీర్పు ఇచ్చారు. వెంటనే అందరూ శభాష్ తెలంగాణ ప్రభుత్వం, శభాష్ కేసీఆర్ అన్నారు. దుబాయ్, కువైట్ లాగా స్పాట్ లో డెసిషన్ తీసుకున్నారు హ్యాట్సాఫ్ అన్నారు. అలా పూర్తిగా ఆ విషయాన్ని ఎవ్వరూ ఆనందించక మునుపే కనీసం వారం తిరగకముందే హైకోర్టు మళ్ళీ స్పందించి శిక్షను తగ్గిస్తూ ఉరి శిక్షకాదు యావజ్జీవ కారగార శిక్షను విధిస్తున్నాము అన్నారు. ఇలా శిక్షల పై నిర్ణయాలు మార్చుకుంటున్న నేపధ్యంలో చిన్న పిల్ల పై ఆకృతంగా ప్రవర్తిస్తేనే ఏమీ లేదు. మనం ఏమైన చెయొచ్చు ముందు ఉరి శిక్ష విధించినా తర్వాత మనల్ని కూడా కాపాడే కోర్టులు ఉంటాయి అన్న ఆలోచన వాళ్ళకు కల్పించడమే కదా అని అన్నారు.
అదే స్పాట్లో శిక్షిస్తే ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం తప్పుతుంది కదా. ఇప్పటి సీపీ సజ్జనామగారు అప్పటి వైఎస్సార్ గారు ఉన్నప్పుడు వరంగల్లో జరిగిన యాసిడ్ దాడి సమయంలో ఆయన స్పాట్లో యన్ కౌంటర్ చేయించేశారు. ఆ సంస్కృతి ఎందుకని ఇప్పుడు లేదు. ఎందుకు ఆపేశారు. అసలు మన భారత దేశంలో ఉగ్రవాదులు మన దేశం మీద పడినప్పుడు కసబ్ లాంటి వారి తరపున కూడా వాదించే లాయర్లు మన దేశంలో ఉన్నారంటే సిగ్గుతో తలదించుకోవడమే. ఇదంతా కేవలం డబ్బులకోసమేనా డబ్బులు ఇస్తే దేశాన్ని ధ్వంశం చేసే తీర్పులు ఇచ్చేస్తారా. చివరాకరికి వాళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయంటే వాడి మానసిక పరిస్థితి బాలేదని, వాడు సైకలాజికల్గా డిస్ట్రబ్ అయ్యాడు అంటారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ అంగాన్ని కట్ చేసి పొట్లాంలో కట్టి వాళ్ళ తల్లిదండ్రులకు పంపించాలి. ఎదవ ల...జకొడుకుల్ని కనేసి రోడ్ల మీదకు వదిలేసిన తల్లిదండ్రులకు పంపించాలి. తల్లిదండ్రులు కనీస బాధ్యత తీసుకుని వాళ్ళకు మంచి చెడులు నేర్పించకుండా వాళ్ళని జంతువుల్లా నడి రోడ్డు మీదకు వదిలెయ్యడం కాదు అని ఘాటుగా స్పందించారు.