జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తే పూర్తి స్థాయి ప్రజాసేవకు దిగుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన రాజకీయమంతా జగన్ని తిట్టిపోయడానికే సరిపోతోందని సెటైర్లు పడుతున్నాయి. ఎక్కడో హైదఅరాబాద్ లో జరిగిన దిశ హత్యోదంతాన్ని జగన్ కి తగిలించి మహిళల రక్షణకు చర్యలు తీసుకోరా అని వూగిపోవడమే పవన్ మార్క్ రాజకీయమా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

పవన్ నెలకో టూర్ ప్రొగ్రాం పెట్టుకుంటున్నారు. ఆయన చూసిన సమస్యలు, పరిష్కారాల సంగతేమో కానీ జగన్ని టార్గెట్ గా చేసుకుని నిందలు బండలు వేయడం ద్వారానే టీడీపీ అనుకూల మీడియాలో హైలెట్ అవుతున్నారని అంటున్నారు. జగన్ రెడ్డి కులమేంటని, మతమేంటని అడగడానికి పవన్ సినిమాలు మానేయనక్కరలేదని కూడా సెటైర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి.

 

ఇక పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ చదువుల పై చేసిన కామెంట్స్ లో కూడా మళ్ళీ జగన్ని తీసుకురావడమే అసలైన  చిత్రమంటే. ఇంగ్లీష్ చదువుకున్న వారు గొప్పవాళ్లు అయితే అవినీతి ఆరోపణలపైన జైలుకు ఎందుకు వెళ్తారంటూ పవన్ ప్రశ్నించడ‌మూ ఆశ్చర్యమే. మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే మధ్యలో జగన్ని తెచ్చేసి ఆయన్ని టార్గెట్ చేయడమేనా జగన్ కి తెలిసింది అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గట్టిగానే తగులుకుంటున్నారు.

 

తాట తీస్తా, తోలు తీస్తా ఈ భాష పవన్ అసలు మానేయ‌లేకున్నారని కూడా వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు. రాయలసీమకు వెళ్ళి ఆ రోటి పాట పాడుతున్న  పవన్ గోదావరి జిల్లాలో నుంచి సీమను ఎగతాళి  చేసిన వైనాన్ని గుర్తుకుతెస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఆవేశ కావేశాలు, జగన్ని ఏదోలా నిందించడంతో పవన్ పొద్దు పుచ్చుతున్నారు తప్ప నిర్మాణాత్మకమైన విపక్ష పాత్ర పోషించడం లేదని వైసీపీ నేతలు  అంటున్నారు. మరీ ఇలా అలసిపోవాల్సిన అవసరం ఉందా అన్ని కూడా ఫ్యాన్ పార్టీ నుంచి  కౌంటర్లు పడుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: