మన దేశంలో రోజురోజుకి ఆడవారిపై అఘాయిత్యాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు రాజకీయ నాయకులు వచ్చినా, అలానే వాటితో పాటు ఎంత కఠినంగా శిక్షలు అమలు చేయబడుతున్నా, ఎక్కడో ఒక చోట మాత్రం అభం శుభం తెలియని ఎందరో అమ్మాయిలు, కొందరు మానవ క్రూరమృగాల అకృత్యాలకు బలవుతున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతంలోని తొండుపల్లి టోల్ గేట్ ప్లాజా వద్ద వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి (దిశ)ని నలుగురు దుండగులు ఎంతో ఘోరంగా రేప్ చేసి హత్య చేసిన ఘటన పై దేశవ్యాప్తంగా ప్రజలు మరియు పలువురు ప్రజా, 

 

మహిళా సంఘాల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ వంటి చట్టాల అమలు తరువాత కూడా అమ్మాయిలపై ఈ విధంగా అత్యాచారాలు జరగడం ఘోరం అని, ఇకనైనా ఇటువంటి ఘోరాలు జరుగకుండా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ కేసులో నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని, వారి శిక్షలు చూసి ఇకపై అమ్మాయిల జోలికి రావాలంటే మృగాళ్లు భయపడాలని అంటున్నారు. ఇక ఈ కేసులో ఒక వ్యక్తి కీలకంగా మారబోతున్నట్లు సమాచారం. ముందుగా నిందితులు నలుగురు కూడా టోల్ గేట్ కి కొంత దూరంలో ఉన్న ఒక రూము వద్దకు ప్రియాంకను తీసుకెళ్లినట్లు తెలిపారు. 

 

అయితే ఆ సమయంలో ఆ రూమ్ లోపల తలుపులు వేసి ఉండడంతో కిటికీలోనుండి ఆమెను లోపలి నెట్టేందుకు ప్రయత్నించారని, కానీ కిటికీలు తెరుచుకోకపోవడంతో ఆమెపై బయటే అత్యాచారం చేసినట్లు తెలిపినట్లు తెలిపారు. కాగా ఆ రూమ్ లో ఉండే ఒక పెద్దాయనను ఘటన జరిగిన తెల్లారి సమయంలో పలువురు మీడియా వారు ప్రశ్నించినప్పటికీ, అతడు మాత్రం నోరు విప్పలేదు. కాగా ఈ కేసులో అతడు కూడా కొంత కీలకంగా మారనున్నట్లు సమాచారం. కాగా నిందితులను ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉంచిన పోలీసులు, తదుపరి విచారణ అనంతరం మరొక్కమారు కోర్ట్ లో ప్రవేశబెట్టనుననట్లు తెలుస్తోంది....!!     

మరింత సమాచారం తెలుసుకోండి: