హైదరాబాద్ పశు వైద్యురాలి  హత్య మరియు అత్యాచారం కు సంబందించిన   దారుణమైన సంఘటన  మరువక ముందే, బీహార్లోని బక్సార్ జిల్లాలోని కుకుధ గ్రామంలో సోమవారం రాత్రి బాలిక పై అత్యాచారం చేసి కాల్చి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 

 

 

 

ఇటాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడారి పొలం నుంచి మంగళవారం ఉదయం కాలిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బక్సర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ తెలిపారు. బక్సర్  బీహార్  రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ దూరం లో ఉంటుంది . ప్రజల సమాచారం తరువాత పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు, బాలిక  నడుము పై కాలిన గాయాలు కనిపించాయని, హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తుందని, ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగి ఉండవచ్చునని ఆయన అన్నారు. బాధితురాలి  గుర్తింపు, వయస్సు ఇంకా తెలియరాలేదని అయన  తెలిపారు.

 

 

 

పోస్టుమార్టం  రిపోర్ట్ వచ్చిన తర్వాత అమ్మాయి మైనర్ లేదా మేజర్ అని స్పష్టంగా తెలుస్తుంది, అని అన్నారాయన. సాక్ష్యాధారాలను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో  బాలిక పై అత్యాచారం చేసి కాల్చి చంపారని  ఇటాడి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. బాధితురాలి తలపై కాల్పులు జరిపారు, పోలీసులు అక్కడి నుండి ఖాళీ తుపాకీ గుళ్లను  స్వాధీనం చేసుకున్నారు. ఉదయం వందలాది మంది గ్రామస్తులు అక్కడ గుమిగూడారు, కాని బాలిక శరీరం  నడుము పైన కాలి  పోవడం తో   వారిలో ఎవరూ గుర్తించలేకపోయారని  పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనతో అక్కడి ప్రజలు ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురి అయ్యారు.

 

 

 

నవంబర్ 27 న హైదరాబాద్ లో నలుగురు వ్యక్తులు యువ  పశువైద్యురాలిని  సామూహిక అత్యాచారం చేసి  తరువాత  కాల్చి చంపిన సంఘటనకు బీహార్ బక్సార్ జిల్లాలోని కుకుధ గ్రామంలో జరిగిన  సంఘటన దగ్గరగా ఉంది. తాజా పరిణామాలతో మహిళలు బయట వెళ్లాలంటే ఆందోళనకు గురి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: