లోకం ఎటువైపు పయణిస్తుందో అర్దం అవడం లేదు. మగాళ్లతోనే మహిళలకు ఇబ్బందులు అనుకుంటే ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువుల్లా మారుతున్నారు. ఇప్పటికే సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దాడులతో పోలీసులు తలలు పట్టుకుంటుంటే ఇప్పుడు ఇదో కొత్త తలనొప్పి వచ్చిపడింది.

 

 

అదేమంటే ఒక మహిళపై మరో మహిళ యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపుతోంది. ఇదెక్కడ జరిగింది అనుకుంటున్నారా విశాఖపట్నంలో జరిగింది.  రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వివాహితపై గుర్తు తెలియని మహిళ యాసిడ్ పోసి పరారైంది. యాసిడ్ చల్లడంతో వివాహిత శరీరం ముప్పై శాతానికి పైగా కాలిపోయనట్లు తెలుస్తోంది. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాలు తెలుసుకుంటే  శిరీష అనే యువతి వివాహమై హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా అవసరం నిమిత్తం విశాఖ వచ్చింది.

 

 

నగరంలోని సమతా నగర్‌లో శిరీష నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడి చేసింది. ఒక్కసారిగా యాసిడ్ ఒంటిపై పోయడంతో శిరీషకు తీవ్రగాయాలయ్యాయి. సుమారు 30 శాతానికిపైగా కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను స్థానిక ఆర్కే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన గంటల వ్యవధిలోనే యాసిడ్ దాడి జరగడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

 

ఇకపోతే హైదరాబాద్‌లోని శిరీష కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించి వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే శిరీషపై యాసిడ్ దాడికి పాల్పడింది కూడా మహిళేనని తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితురాలి కోసం పోలీసులు వెతుకుతున్నారు.  ఎవరిపైన అయినా అనుమానం ఉందా, ఉద్దేశ పూర్వకంగా యాసిడ్ దాడికి ఎందుకు పాల్పడింది అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

 

 

ఇకపోతే హైదరాబాద్ యువతిపై విశాఖలో దాడి జరగడం పై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇందుకు గల కారణాలను లోతుగా పరిశీలిస్తే గాని విషయం బయటపడదంటున్నారు. ఇకపోతే ఈ ఘటన మానవ సంబందాలకు విలువలేదని తెలియచేస్తుంది. ఆడది ఆడదానికే శత్రువు అనే సామేతను నిజం చేస్తుందంటున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: