దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  క్రైమ్ రేటు మార్కెట్ సూచీలా పెరిగిపోతున్నది.  బయటకు వెళ్లిన అమ్మాయిపై ఇంటికి వచ్చేంత వరకు తల్లి దండ్రులు భయం భయంగా కాలం గడుపుతున్నారు.  ఇంట్లో ఉంటెనే రక్షణ ఉంటుంది అనుకుంటున్నారు.  కానీ, ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోతున్నది.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు ప్రబుద్ధులు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు. 
వరస వావి లేకుండా హింసిస్తున్నారు.  బెదిరిస్తున్నారు.

 

 బయటకు చెప్తే చంపేస్తామని అంటున్నారు.  ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొన్నే బయటకు వస్తున్నాయి.  ఇలాంటి వాటిలో ఒకటి సూర్యాపేటలో జరిగింది.  సూర్యాపేటలో తన తల్లితో కలిసి ఓ 16 ఏళ్ల యువతి నివసిస్తున్నది.  పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తల్లి ఇటీవలే మరో పెళ్లి చేసుకుంది.  కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నది.  ఇద్దరు కొడుకులు స్కూల్ కు వెళ్తుండగా, 16 ఏళ్ల కూతురు ఇంట్లోనే ఉండి తల్లికి సహాయం చేస్తున్నది.  


తల్లికి సహాయ సహకారాలు అందిస్తున్న ఇంటివద్దనే ఉంటుంది.  ఏవైనా పనులుంటే తల్లితో కలిసి కూలిపనులు వెళ్తూ జీవిస్తున్నారు.  అయితే, కూతురు వరసైన 16 ఏళ్ల యువతిపై సవతి తండ్రి కన్నేశాడు. నవంబర్ 1 వ తేదీన కూతురిపై అత్యాచారం చేయాలని చూశాడు.  ఆ యువతి కేకలు వేయడంతో ఎవరికి చెప్పొద్దూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.  దీంతో ఆ యువతి ఎవరికి చెప్పలేదు.  


కానీ, నిన్నటి రోజున మరలా మారుతండ్రి యువతిపై కన్నేశాడు.  ఇంట్లో ఒక్కతే ఉండటంతో ఆ యువతిపై అత్యాచారం చేయబోయాడు.  అయితే, ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకొని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడే ఉన్నది.  సాయంత్రం తల్లి రాగానే.. తల్లికి జరిగిన విషయం చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దిశ కేసు తరువాత ఇలాంటి వాటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: