లోకం తీరు ఎలా వుందంటే చంపడానికి నిమిషం కూడా ఆలస్యం చేసిన నిందితులను శిక్షించడానికి మాత్రం రోజుల తరబడి పడుతుంది. ఇదేమి విచిత్రమో కాని సౌదిలా మనకు చట్టం తెస్తే గాని కామంలో పుట్టే మదం అనిగేలా లేదు. ఇకపోతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘దిశ’ కేసు విచారణ కోసం శంషాబాద్‌ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ కేసును సమగ్రంగా విచారించడంతో పాటు, ఆధారాలు కూడా సేకరిస్తుంది.

 

 

ఇకపోతే ఈ కమిటీని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షించనున్నారు. ఇక ఈ దర్యాపు కమిటీలో నలుగురు అడిషనల్ డీసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐ లతో పాటు 12 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీని శంషాబాద్ డిసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసారు.. ఇకపోతే  మరోవైపు ఉన్నతాధికారులు ఈ కేసు విచారణను గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఈ కేసు అత్యంత తీవ్రత కలిగినది కావడంతో దర్యాప్తునకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాకుండా చూసుకుంటున్నామని తెలుపుతున్నారు..

 

 

ఇదే కాకుండా ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు కావడంతో నిందితులకు కఠినశిక్ష పడేలా స్పెషల్‌ టీమ్ ఆధారాలు త్వరగానే సేకరిస్తోంది. ఇందుకు గాను కామాంధులు ప్రయాణించిన లారీలో దొరికిన ఆధారాలను ఇప్పటికే ఫోరెన్సిల్ ల్యాబ్‌కు పంపించారు. ఇదే కాకుండా మృతదేహాన్ని కాల్చివేసిన ప్రాంతంలో దొరికిన వస్తువులను కూడా ల్యాబ్‌కు పంపించారు.

 

 

లారీలో దొరికిన రక్తపు నమూనాలను డీఎన్ఏతో సరిపోల్చేందుకు పరీక్షలు జరిపిస్తున్నారు. నిందితులకు కస్టడీ పూర్తయిన వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. కస్టడీలో నిందితులు ఇచ్చే సమాచారాన్ని కేస్ రీ కన్స్ట్రక్షన్ చేసి. ఆ వివరాలన్నీ ఛార్జిషీట్‌ పొందుపరచనున్నారు. ఇక త్వరగా నిందితులను శిక్షిస్తే బాధిత కుటుంబాలకు కొంతవరకైన స్వాంతన చేకూరుతుందని కొందరు భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: