టీడీపీ అధినేత చంద్రబాబు...రోజూ భోజనం చేస్తారో లేదో తెలియదుగానీ...రోజూ మీడియాలో మాత్రం కనిపించకుండా ఉండలేరు. ఆయన ఏదోవిధంగా ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. సరే మీడియా ముందుకొస్తే ప్రజలకు ఉపయోగపడేవి ఏమన్నా చెబుతారంటే? అది ఉండదు. ఎంతసేపు గంటల గంటల సేపు చెప్పిందే చెప్పి ప్రజలకు బోరు కొట్టేలా చేస్తారు. అందులో ఆయన గురించే ఎక్కువసేపు భజన చేసుకుంటారు. అయితే సొంత ప్రెస్ మీట్లలో భజన చేసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ తాజాగా బాబు అమరావతి నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం పెట్టి మరి రోజూ చెప్పే సోదిని మళ్ళీ చెప్పారు.

 

తానే హైదరాబాద్ నిర్మాణం చేశానని, ప్రపంచ పటంలో పెట్టానని, ఇప్పుడు అమరావతిని ప్రపంచం గర్వించదగ్గ రాజధానిగా చేయాలని అనుకున్నాని, కానీ వైసీపీ దానిని నాశనం చేసిందని రిపీట్ మోడ్ లో వచ్చారు. మామూలుగా సొంత సమావేశాల్లో ఈ సోది చెప్పుకుంటే కొంతవరకు బెటర్ కానీ...ఇలా పలు పార్టీలని పిలిచి వారి ముందుకు మీ డప్పే కొడితే యావగింపుగా ఉంటుంది. పైగా సమావేశంలో వైసీపీని విమర్శించడం తప్ప అందులో ప్రజలకు ఉపయోగపడేది ఏది లేదు.

 

సరే బాబు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఆయనని ఎవరు మార్చలేరని వదిలేద్దాం. అయితే సమావేశానికి వచ్చిన వారు కూడా అసలు విషయం వదిలేసి ఎక్కువ బాబుని పొగడటమే పనిగా పెట్టుకున్నారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు లాంటి సీనియర్ ఉండాలని, కాబట్టి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు సలహాలు తీసుకోవాలనే డప్పు కొట్టారు. ఈ విధంగా సీనియర్ అనే 2014లో చంద్రబాబుని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్లు ఏం చేశారో అందరికీ తెలుసు. 

 

రాజధాని పేరిట ఓ బాహుబలి గ్రాఫిక్స్ చూపించి ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు. అలాగే ఐదేళ్లలో రాజధానిలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా చేశారు కాబట్టే  మొన్న ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో టీడీపీ ఒక్క సీటు గెలుచుకోలేదు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సమావేశానికి వచ్చినవారు బాబుని ఎలా పొగిడారో ఎవరికి అర్ధం కాలేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: