ఈరోజు తెల్లవారుజామున దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపిన ఘటనలో దేశంలోని ఆడపిల్లలంతా ఒకపక్క సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఎన్ కౌంటర్ జరిగిన కొద్ది సేపటికే స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పై పూలవర్షం కురిపించారు. ఎంత మంది ప్రముఖులు మరియు సామాన్య ప్రజలు న్యాయం గెలిచిందని మరియు ఇంకొకసారి ఒక ఆడపిల్ల పై చేయి వేసేముందు దీనిని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అలాగే ఇంతకుముందు రేప్ కు గురైన బాధితులు మరియు వారి తల్లిదండ్రులు కూడా ఈ ఎన్ కౌంటర్ పై సానుకూలంగా స్పందించగా దిశ తల్లి యొక్క రియాక్షన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

నలుగురు నిందితులను ఉదయం ఎన్ కౌంటర్ చేసిన తర్వాత తండ్రి నా కూతురు ఆత్మ శాంతించి ఉంటుంది అని చెప్పగా... దిశ చెల్లి భవ్య రెడ్డి కూడా ఎన్ కౌంటర్ ను స్వాగతించారు. అయితే దిశ తల్లి మాత్రం ఈ ఎన్ కౌంటర్ ద్వారా న్యాయం నిలిచినా కూడా వారు ఐదు నిమిషాలు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఐదు ప్రాణాలు పోయాయి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

 

అప్పుడు వారు దుర్బుద్ధితో తన కూతురిని అలా చేయకుండా ఉండుంటే తన కూతురితో పాటు మరో నలుగురు తల్లుల కడుపు వేదన కూడా జరగకుండా ఉండేది అని ఆమె వాపోయింది. ఇలా తన కూతురితో పాటు చనిపోయిన ఆ నలుగురి విషయంలో కూడా బాధపడినా... ఆమె చివరికి మాత్రం న్యాయం జరిగిందని తెలంగాణ పోలీసులు కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఇదే విషయమై నిర్భయ తల్లి కూడా ఇది చాలా సంచలనమైన నిర్ణయం అని ఇకపై ఇటువంటి మానవమృగాలు తప్పు చేసేందుకు భయపడేలా పోలీసులు చేసిన ఈ పనిని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: