షాద్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చటాన్పల్లి బ్రిడ్జి కింద నలుగురు నిందితులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించిన దిశ ఉదంతంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చటాన్పల్లి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిందితుల ఎన్కౌంటర్.. దిశను హత్య చేసిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో జరిగింది. ఇవాళ ఉదయం 3:30 నుంచి 5 గంటల మధ్యలో దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. అయితే, ఈ దుర్మార్గుల తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారని తెలియడంతో.. ఆ ప్రాంతానికి సమీప జనాలు భారీగా తరలివచ్చారు. ఈ రోజు ఉదయం పోలీసులు జరిపిన ఈ ఎన్కౌంటర్ పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, నిందితుల శవాలకు పోస్ట్ మార్టం చేసేందుకు మరియు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు నలుగురు నిందితుల తల్లిదండ్రులను ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి తీసుకువచ్చారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్నవారు ఘటన ప్రదేశంలో ఉన్న పోలీసులపై పూల వర్షం కురిపించి వారికి స్వీట్స్ తినిపించారు. తెలంగాణ పోలీస్ జిందాబాద్ అంటూ కేకలు వేశారు. సీపీ సజ్జనార్ , తెలంగాణ పోలీస్ , సీఎం కేసీఆర్పై ప్రశంసలు వర్షం కురిపించారు. దీంతో నిందితుల్లోని ఓ వ్యక్తి తల్లిదండ్రులు తమ కొడుకు శవాన్ని ఇంటికి తీసుకుపోయేందుకు సైతం ఇష్టపడలేదని, ఈ విషయం పోలీసులకు చెప్పారని సమాచారం.
దిశ హత్యలో నిందితులు స్పష్టమైన అనంతంర... హత్య చేసిన నిందితులని జైల్లో పెట్టి మేపడం వద్దు. వారిని పబ్లిక్గా ఉరి తీయండి. అప్పుడే దిశ ఆత్మ శాంతిస్తుందని పలువురు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు జరిపిన ఈ ఎన్కౌంటర్పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. నిందితులకి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సరైన శిక్ష విధించారని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. దిశ కుటుంబం నివాసం ఉండే శంషాబాద్ నక్షత్ర కాలనీలో నిందితుల ఎన్ కౌంటర్ అనంతంరం ఆనందం వెల్లివిరిసింది. నిందితులకి తగిన శిక్ష పడింది. ఈ ఘటనతో అయిన నేరం చేయాలంటే ప్రతి ఒక్కడ భయపడతాడని, తెలంగాణ పోలీసులు చూపిన ఈ చొరవకి ప్రత్యేక ధన్యవాదాలు అని కాలనీ వాసులు చెబుతున్నారు.