దిశను అతికిరాతకంగా మానభంగం చేసి బ్రతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టిన నలుగురు నిందితులను నేడు తెలంగాణ పోలీసు వారు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన నేపథ్యంలో దేశమంతా సంబరాల్లో మునిగి పోయింది. అయితే ఆ నిందితుల ఇంట్లోని వారు మాత్రం ఈ విషయం పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగింది అక్షరాలా మోసం అని, తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ఇది సరైన పద్ధతి కాదని వారి వాదన.

 

నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య ప్రస్తుతం గర్భిణి. ఆమె భర్త చావు పై మాట్లాడుతూ కేసు విచారణలో ఉంది... నా మొగుడిని కోర్టు మొత్తం వాదనలు విన్న తరువాత శిక్షించి ఉంటే నేను సంతోషంగా ఉండేదానిని కానీ ఇప్పుడు నా భర్త మృతి చెందిన తీరు మాత్రం ముమ్మాటికీ తప్పు. అసలు ఇది కౌంటర్ అని నేను ఒప్పుకోను అని ఆమె చెప్పడం గమనార్హం.

 

అలాగే అత్యాచారానికి గురైన దిశ ఆమె చెల్లెలకు ఫోన్ చేసే బదులు పోలీసువారికి ఫోన్ చేయాల్సిందని ఆమె అన్నారు. ఒక అమ్మాయి ప్రాణానికి బదులుగా నలుగురిని పొట్టనపెట్టుకోవడం అన్నది అన్యాయమని చెబుతున్న ఆమె తన భర్తను ఏ విధంగా అయితే ఎన్ కౌంటర్ చేసి చంపేశారో నన్ను కూడా అదే విధంగా చంపేయండి. ఇంక నేను ఈ భూమిపైన బ్రతకాలి అనుకోవడం లేదని చెన్నకేశవులు భార్య తీవ్రంగా వాపోయింది.

 

ఇకపోతే చనిపోయిన నలుగురు నిందితుల మృతదేహాలను పోలీసు వారు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు మరికొద్ది సేపట్లో వారి మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుండగా పోలీసులు వారి ఇంటి సభ్యులకు త్వరలోనే అందించబోతున్నారని సమాచారం. ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉండగా చెన్నకేశవులు భార్య అన్న మాటలను మాత్రం నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు, ఆమె ఏదో భర్త పోయిన బాధలో అలా ఎమోషనల్ గా అంటోందని... కాలం గడిచేకొద్దీ తానే అంతా అర్థంచేసుకుంటుందని అంతా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: