దిశ నిందుతలను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై ప్రధాన నిందితుడైన చెన్నకేశవ భార్య మీడియా ముందు సంచలన కామెంట్స్ చేసింది. నా భర్తను ఎవరని అడిగి చంపేశారని .. కోర్ట్ చెప్పిందా ? లేకుంటే ఎందుకు చంపారని ఇక నన్ను కూడా చంపండని మీడియా ముందు చెప్పింది. నా భర్తను కావాలనే చంపేశారని మీడియా ముందు వాపోయింది. 

 

అయిత దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను తక్షణమే ఎన్ కౌంటర్ చేసి పారేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీని గురించి పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. అయితే సీన్ రికన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులను దిశ చనిపోయిన స్పాట్ కు తీసుకొచ్చారు. అయితే నిందితులు తప్పించుకోబోతుండగా పోలీసులు వారిని కాల్చి చంపేశారు. దీనితో సరిగ్గా ప్రియాంక రెడ్డి ఎక్కడ అయితే చనిపోయిందో వారు కూడా అక్కడే చనిపోవటం విశేషం. దీనితో ప్రజా సంఘాలు .. ప్రజలు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

దేశ వ్యాప్తంగా దిశ ఘటన సంచలనం రేపిన సంగతీ తెల్సిందే. ఈ ఘటన పై దేశ ప్రజలు భగ్గుమన్నారు. సినీ ప్రముఖులు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ పార్లమెంట్ ఈ ఘటన పై భగ్గుమన్నది. ఈ ఘటనకు వ్యతిరేకంగా యావత్ భారతావని గొంతెత్తుతోంది. దిశ దారుణ హ్యతకు నిరసనగా ప్రజలంతా రోడ్లపైకి ఎక్కారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా సమాజం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కొట్టుకున్నారు. ఇప్పుడు సరిగ్గా అటువంటిదే జరిగింది. 

 

నిర్భయ కేసు తరువాత దేశం మొత్తం ఆగ్రహాన్ని తెప్పించిన ఘటనగా చెప్పొచ్చు. హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఈ ఘటన.. దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనను బాలీవుడ్ప్రముఖులు సైతం ఖండించారు. సల్మాన్ ఖాన్అక్షయ్ కుమార్ ఈ ఘటనను ఖండిస్తూ.. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: