దిశ హత్య తరువాత దేశం అంత ఒకే మాట ఆమెను చంపినా వారికి ఉరిశిక్ష గాని లేదా ఎన్కౌంటర్ గని చేయాలనీ కోరుకున్నారు అన్న విషయం మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కేసు నేపథ్యం లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం బయట పరిస్థుతుల దృశ్య జైలు లోనే విచారించాలని నిర్ణయంచారు. అయితే శుక్రవారం రాత్రి వారితో హత్య ఎలా చేసారు, ఎలా జరిగింది అని వారితోనే మళ్ళి చూపించే ప్రయత్నం లో చీకటి కారణంగా నిందితులు నలుగురు మానని ఎట్లైనా చంపేస్తారనే అనుమానం తో రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగడంతో పాటు పోలీసుల దగ్గరి నుంచి గన్లు లాక్కొని పోలీసులపైన కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
ఉదయం గంట పాటు వారు తప్పించుకోవడానికి ప్రయత్నించి మిగతా పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ మరణించడం జరిగింది. ఎందులో భాగంగా పోలీసులకు చాల దెబ్బలు తగిలాయని వారిని హైదరాబాద్ హైటెక్సిటీలోని కేర్ ఆస్పత్రికి తరలించారు అని మీడియా తో సీపీ సజ్జనార్ మీడియా తో తెలియచేసారు. నారాయణపేట జిల్లా గుడిగండ్ల, జక్లేర్ నుంచి మృతుల తల్లిదండ్రులను పోలీసులు ఘటన స్థలానికి తీసుకెళ్లారు. ఘటనాస్థలికి బయల్దేరిన వారిలో మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్, చెన్నకేశవులు తండ్రి కురుమప్ప, జొల్లు శివ తండ్రి రాజప్ప జొల్లు నవీన్ తల్లి లక్ష్మి ఉన్నారు.
ఆ నలుగురి మృతదేహాలకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు శవపంచనామా నిర్వహించి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అలాగే ఈ ఘటనలో ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ లకు గాయాలయ్యాయి అని గాయపడిన వారిని వెంటనే చికిత్సపై కేర్ హాస్పిటల్స్ వైద్యులు స్పందించారు. నిందితుల రాళ్ల దాడిలో ఎస్సై వెంకటేశ్వర్లు తలకు గాయమైంది. అని సీపీ వివరాయించారు. కానిస్టేబుల్ అరవింద్గౌడ్ కుడి భుజంపై కర్ర గాయాలయ్యాయి అని ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.