తెలుగుదేశం పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారో ఏమో గాని తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం వారిని హీరోలు అంటూ కొనియాడే పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఏం మాట్లాడినా సరే పదే పదే సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలకు అనవసర ప్రచారం ఇవ్వడమే కాకుండా వాళ్ళు మెచ్చుకున్నారు వీళ్ళు మెచ్చుకున్నారు అంటూ ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ఇటీవల కొన్ని రాతలు కూడా సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. 

 

రామ్మోహన్ నాయుడు ని సోనియా గాంధీ పిలిచి మాట్లాడారని, గల్లా జయదేవ్ ని బిజెపి పిలిచిందని ఎవరికి తోచిన రాతలు వాళ్ళు రాస్తూ సోషల్ మీడియాలో కావలసినంత బొంబాయి వార్తలు వండి వారుస్తున్నారు. ఇక ఇప్పుడు ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు షాక్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కేసినేని నానీ కి కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనతో ఇటీవల పార్లమెంటే సమావేశాల సందర్భంగా కేసినేని నాని సమావేశం అయ్యారు. 

 

విజయవాడలో కొన్ని అభివృద్ధి పనుల కోసం ఆయన గడ్కరిని కలిసి నిధులు మంజూరు చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా గడ్కారి ఆయన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు సమాచారం. వస్తే కేంద్రంలో కూడా పదవి ఇస్తామని చెప్పారట ఆయన. ఇక గల్లా జయదేవ్ కూడా బిజెపి నేతలతో టచ్ లో ఉన్నారు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఆయనకు కేంద్ర మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయి. 

 

గ‌ల్లా పారిశ్రామిక వేత్త కావ‌డంతో ఆయ‌న‌కు ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వంతో అవ్వాల్సిన ప‌నులు చాలానే ఉన్నాయ‌ని టాక్‌. దీనితో ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు పార్టీ మారితే మాత్రం చంద్రబాబుకి పెద్ద దెబ్బే. 

మరింత సమాచారం తెలుసుకోండి: