ఒక వైపు అమ్మాయిలపైన రోజు రోజుకు జరుగుతున్న హత్యాచారాలను చూస్తుంటే ఎంత దారుణం అనిపిస్తుంది. మరో వైపు ప్రేమికులను నమ్మి సర్వాన్ని అర్పించుకుంటున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ప్రేమించేవాడు మోసం చేస్తాడా, న్యాయంగా ఉంటాడా అనే ఆలోచన లేకుండా వారితో ఇష్టరీతిగా ప్రవర్తించడం తర్వాత సమస్యలు కొని తెచ్చుకోవడం. ఇప్పుడు సమాజంలో ఇదే జరుగుతుంది.

 

 

ఇకపోతే ఆ మధ్య హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఓ జంట ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా ఓ జంట మెట్రో రైల్లోనే ముద్దుల్లో తేలింది. చుట్టుపక్కల జనం ఉన్నారు అనే ధ్యాసే లేకుండా, అసలు తాము మనుషుల మధ్య ఉన్నాం అనే ఆలోచన లేనట్లుగా తమకేం పట్టనట్లుగా వాళ్లు హగ్‌లు ముద్దులు పెట్టుకొని రెచ్చిపోయారు. ఈఘటన ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేసుకుంది. తోటి ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది. అంతే కాకుండా మరోవైపు దీన్ని తోటి ప్రయాణికులు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ అయ్యింది.

 

 

ఇకపోతే వీరి వ్యవహారాన్ని కొంతమంది ప్రయాణికులు వ్యతిరేకిస్తూ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పబ్లిక్ గా వీరు వ్యవహరించిన తీరు సబబు కాదని విమర్శించారు. దీంతో దీనిపై రికార్డయిన వీడియోను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఈ మద్యకాలంలో కోరిక పుట్టడమే ఆలస్యం మెట్రో రైలులో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు.

 

 

తోటి ప్రయాణికులు చూస్తున్నారనే జ్ఞానం లేకుండా కౌగిలింతలు, ముద్దులతో రోమాన్స్‌లో మునిగితేలుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లలో ఇలాంటివి నిషిద్దమనే కఠిన నిబంధనలు  అమలు చేయక తప్పదు. లేకుంటే ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగితే మాత్రం అమ్మాయిలంటే ఇంకా చులకన భావం ఏర్పడి అఘాయిత్యాలు మరిన్ని జరిగే అవకాశాలుంటాయని అంటున్నారు కొందరు పెద్దలు..

మరింత సమాచారం తెలుసుకోండి: