స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నట్టుగా మన దేశంలో పూజార్లు కంటే బాబాలే ఫేమస్. అందుకే మన సమాజంలో ఉన్న స్వాములు మనుషుల్లో వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటూ... స్వయంగా దేవుళ్లం అని చెప్పుకుంటూ ఉంటున్నారు. అందులో నిత్యానంద ఒకరు. ఓవైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే... ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకుల్ని తన భక్తులుగా చేర్చుకుంటూ బిజినెస్‌ను పెంచుకుంటున్నాడు. మరి ఇలాంటి వాళ్ళని ప్రభూత్వాలు ఎందుకు వదిలిపెడుతున్నారో అర్థం కావడం లేదని జనాలు వాపోతున్నారు. ఆయన చేసిన ఆకృత్యాలన్ని ప్రత్యక్షంగా చూసి కూడా ఏమీ చేయడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

ఇండియాతోపాటూ... విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో డొనేషన్లు ఇస్తూ... నిత్యానంద ని దేవుడిగా మార్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రావడం... నిత్యానంద ఆశ్రమానికి వెళ్లడం, ఆయన చెప్పింది వినడం... ఆ తర్వాత ఆయన భక్తులుగా మారిపోయి... అన్నీ సమర్పించుకోవడం సహజమైపోతోంది. ఇటీవల నిత్యానంద ఆశ్రమ సిబ్బంది... యువతుల్ని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు చేసిన ఘనకార్యాలు వెలుగులోకి రావడంతో... ఒకప్పటి నిత్యానంద భక్తులు ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయోజనం ఏమిటి..?

 

అంతేకాదు ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దగ్గర లేదు. ఇక ఈయనమీద ఇప్పుడు మరో వార్త సంచలనమవుతోంది. ఈక్వెడార్‌ లో ఓ దీవిని కొనేసి, కొత్త దేశం క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు... ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించింది. అయితే వరుసగా మన దేశంలో జరుగుతున్న అఘాత్యాలను చూసి తమ పిల్లలకి ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇక నేను దేవుడిని అంటు చెప్పుకునే నిత్యానందలాంటి వాళ్ళని ఎప్పుడు చంపుతారోనని కొందరు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే ఇలాంటి వాళ్ళ వల్లే జనాలకి పూజార్ల మీద కూడా నమ్మకం పోతోంది. సమాజాన్ని ఎంతగా బ్రష్టు పట్టించాలో అంతా పట్టిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: