కట్టుకున్న వాన్ని ఎలా కడ తేర్చాలనే విషయాల్లో పీహెడీ చేసినట్లుగా కొందరు మహిళలూ వారి ప్లానులను అమలు పరుస్తున్న తీరు చూస్తుంటే మతిపోతుంది. ఐదు నిమిషాల సుఖంలో అంతగా కనబడని స్వర్గం ఏముందో తెలియడం లేదు. ఎందుకంటే క్షణిక సుఖం కోసం ఆవేశపడి మహిళలు గాని పురుషులు గాని ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ సంసారాలను బజారులో పడేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాన్ని కాటికి పంపించింది. కామానికి దాసోహమై తన తాళి తానే తెంచుకుంది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ వివరాలు ఒక సారి చూస్తే బంగారుపేట తాలూకా అనంతపుర గ్రామంలో వెంకటేష్ (30) గాయత్రి (21) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో దాసరహొసహళ్లి గ్రామానికి చెందిన గారమేస్త్రి యల్లప్పతో గాయత్రికి వివాహేతర సంబంధం ఏర్పడింది.. ఈ విషయం ఆనోట ఈ నోట తెలుసుకున్న వెంకటేష్ గాయత్రిని హెచ్చరించాడు. అయినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. చేసేది ఏం లేక బాధతో వెంకటేశ్ మద్యానికి బానిసై గాయత్రితో రోజు గొడవ పడేవాడు.
ఇక కధ సాగదనుకున్న గాయత్రి ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుతో కలిసి పథకం రచించింది. ఈ క్రమంలో గత నెల 24వతేదీన వెంకటేష్ను బెమెల్నగర్ మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి మాంసం తినిపించి అనంతరం తనతో పాటుగా వెంకటేష్ను ఐమరసపుర అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న యల్లప్ప వెంకటేష్ హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇద్దరు ఉడాయించారు.
ఇకపోతే స్థానికులు అటవీ ప్రాంతంలో కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో మృతుడిని వెంకటేష్గా గుర్తించి అతని భార్య గాయత్రిని శనివారం అదుపులోకి తీసుకుని తమదైన స్టెల్లో విచారించగా ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చినట్లు ఒప్పుకున్నారు. కాగా నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ మహమ్మద్ సుజీత అభిందించారు.