దేశంలో ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో ఉల్లిధరలు రూ.120-200కి మధ్యలో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో ధర రూ.150 దాటింది. ప్రభుత్వాలనే ప్రభావితం చేసే శక్తి ఉల్లిపాయల్లో ఉంది. ధరలు కొండెక్కుతుండటంతో ఉల్లి కొనుగోలుకు సామాన్యులు సాహసించడం లేదు. కానీ ఉల్లిగడ్డను ఎక్కువగా వాడే భారత్‌లో.. ఈ ఉల్లిని మొట్టమొదటిగా ఇక్కడ పండించలేదనే విషయం చాలా మందికి తెలియదు. ఉల్లిగడ్డను పండించే ప్రయోగాలు 4000 ఏళ్ల ముందు నుంచే జరిగాయని తెలుస్తోంది.

 

ఇప్పడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఉల్లిగడ్డను పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం ఉల్లిలో.. చైనా, భారత్ రెండు దేశాలు కలిసే 45 శాతం పండిస్తున్నాయి. కానీ ఉల్లి వినియోగంలో మాత్రం భారత్ వెనకబడే ఉంది. "ఉల్లి తక్కువ కేలరీలున్న ఆహారం. ఇందులో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. విటమిన్ సి ఉల్లిలో పుష్కలంగా ఉంటుంది" అని ప్రముఖ పోషకాహార నిపుణురాలు అన్నారు.

 

"100 గ్రాముల ఉల్లిలో ఉండే పోషక పదార్థాల గురించి మాట్లాడుకుంటే ఇందులో 4 మిల్లీగ్రాముల సోడియం, 1 మిల్లీగ్రాము ప్రోటీన్లు, 9-10 మిల్లీగ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 మిల్లీగ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి" అని తెలిపారు. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఉల్లిపాయలు తినాలని సలహా ఇస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండటం వల్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయను తరచూ ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిసాగు ఎక్కువగా ఉండే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది.

 

ఉల్లిగడ్డకు అతిపెద్ద మార్కెటైన మహారాష్ట్రలోని లాసల్గావ్ మండీలో ఇప్పటికీ ఉల్లిగడ్డ ధర రూ.100 పలుకుతుండగా, అది వంటగదికి వచ్చేసరికి రెట్టింపవుతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే ప్రశ్నకు స్పందిస్తూ.. "దిల్లీకి చెందిన హోల్‌సేల్ వ్యాపారులు మహారాష్ట్రకు వచ్చి కిలోకు రూ.100 చెల్లించి రీటైలర్లకు రూ.120-150 చొప్పున అమ్ముతారు" అని మహారాష్ట్రలోని లాసల్గావ్ మండీకి చెందిన హోల్‌సేల్ వ్యాపారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: