ఈ రోజుల్లో సినిమా మార్కెట్ భారీగా పెరగడంతో రాజకీయ నాయకులు కూడా సినిమాల మీద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దర్శక నిర్మాతలతో ప్రముఖ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారితో సినిమా ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ వంతుగా ఆర్ధిక సాయం చేస్తామని చెప్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు సిని పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. నిర్మాతలతో వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వందల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి.

 

ఈ నేపధ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మళ్ళీ సిని నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అదుర్స్ సినిమాతో ఆయన నిర్మాత అవతారం ఎత్తారు. ఆ తర్వాత కొన్ని సినిమాలను వంశీ నిర్మించారు. యేడాదిన్న‌ర క్రితం ఆయ‌న ర‌వితేజ‌తో ట‌చ్‌చేసి చూడు సినిమాను కూడా నిర్మించారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత ఎన్నికలు రావడంతో ఆయన వాటికి దూరమయ్యారు.

 

ఒక ప్రముఖ నిర్మాతతో ఆయనకు లావాదేవీలు కూడా ఉన్నాయి. ఆయనతో కలిసి వంశీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనతో కలిసి వంశీ సినిమాలు నిర్మించాలి అనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయ‌న టీడీపీకి దూర‌మ‌య్యారు. టెక్నిక‌ల్‌గా మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న రాజ‌కీయాల కంటే ఇత‌ర వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

తెలుగుదేశం నుంచి బయటకు రావడం, వైసీపీలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండటం తో వంశీ ఇప్పుడు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారట. వచ్చే ఏడాది మార్చ్ లో ఒక సినిమా మొదలుపెడతారని ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. ఇక ఎన్టీఆర్‌కు వంశీకి క్లోజ్ రిలేష‌న్ ఉంది. కొంద‌రు అయితే ఎన్టీఆర్ మ‌ళ్లీ వంశీతో సినిమా చేసే ఛాన్స్ ఉంద‌ని కూడా అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: