గత కొన్ని రోజులగా మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడి జనసేన పార్టీ కోసం అతని సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన తిరుపతి సమావేశంలో కూడా సడన్ ఎంట్రీ ఇచ్చి అందరికి ఝలక్ ఇచ్చాడు. అలాగే... పవన్ కళ్యాన్ చేసిన 'రేప్ కు రెండు బెత్తం దెబ్బలు శిక్ష' వ్యాఖ్యకు కూడా సామజిక మాధ్యమాలలో సమర్థతను ఇచ్చాడు. అయితే... తాజాగా అధికార పక్షంలోని నేతలను టార్గెట్ చేస్తున్నాడు నాగబాబు.

https://mobile.twitter.com/NagaBabuOffl/status/1203203457324204032

మొట్టమొదటిగా 'జుట్టు తెల్లబడ్డ ప్రతి ఎటు కానీ వాడు పెద్ద మనిషి అనుకోని భ్రమ పడ్డా.ప్రజలు నన్ను క్షమించాలి.ఆ పెద్ద మనిషి పేరు ఆచూకీ ఫోటో తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును' అని ట్వీట్ చేశాడు.


ఆ తరువాత నాలుగు తెల్ల గొరిల్లాల ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశాడు.
https://mobile.twitter.com/NagaBabuOffl/status/1203227111072251904

మరొక ట్వీట్ చేస్తూ... ఈ గొరిల్లా 'బార్సిలోనా జూ' నుంచి తప్పించుకుందని.. నేను ఎక్కడో విన్నాను. దయచేసి దాన్ని ఆ జూ కు తిరిగి పంపించేయండి.

అంతటితో ఆగకుండా... 'మీరు తిన్న ఇసుక మీకు అరిగిందేమో కానీ ఇసుక కొరత కారణంగా పనులు పోయి చనిపోయిన భవన నిర్మాణ కార్మికులు 50 మంది ఉసురు మీకు తగులుతుందని మాత్రం చెప్పగలను.' మళ్ళీ ట్వీటాడు.

భగ్గుమంటున్న ఉల్లిపాయలను ఎక్కడా ఇవ్వనంత చౌకగా ఏపీ సర్కార్ ప్రజలకు మార్కెట్ల ద్వారా విక్రయిస్తుంది. దాని గురించి ఉద్దేశించే నాగబాబు ట్వీట్ చేశాడని నెటిజన్లు చర్చించుకుంటారు. ఇంతకీ ఏం ట్వీట్ చేసాడంటే... 'ఉల్లిపాయలు కేజీ దొరకాలంటే రెండు మూడు గంటలు లైన్ లో నిలబడి తీసుకోవాలి.కేవలం 1 కేజీ మాత్రమే.ఒక్కసారి మీరు లైన్ లో నిలబడి తీసుకోండి.అప్పుడు తెలుస్తుంది కామన్ మాన్ కష్టాలు .. అవునులే జూ లో అన్ని సదుపాయాలు మీ దగ్గరకే వస్తాయి.మీకు తెలియదు. అప్పుడప్పుడు మనుషుల కష్టాలు కూడా తెలుసుకో' అంటూ తీవ్ర విమర్శలు చేశాడు.

'రైతుల కష్టాలు మీకు తెలియవు.పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే అతన్ని విమర్శించండి.కానీ రైతుల సమస్యల మీద వెటకారం చేయకండి ...పోతారు.....' అంటూ తను చేసే ట్విట్టర్ విమర్శలను ముగించాడు.

నాగబాబు ట్వీట్స్ కు వచ్చిన రీట్వీట్స్ లో... ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫొటోస్ తో సహా విజయసాయిరెడ్డి ఫొటోస్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: