లోకంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక వింతలు జరుగుతాయి. అలా జరకపోతే ఎలా చెప్పండి. పెళ్లి అనేది మన దేశ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యమనైది.. అలాంటి పెళ్లి గురించి ఒక మహిళ తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి పందిరిలో పెళ్లి పీటల మీద ఉన్న పెళ్ళికూతురు వరుడితో తాళి కట్టించుకోకుండా మండపంలో ఉన్న వేరొక వ్యక్తితో కట్టించుకుందట. అది కూడా వరుడు ముహూర్తానికి లేటుగా వచ్చాడన్నా కారణంతోనే ఆ వధువు ఇలా చేసినట్టు తెలుస్తుంది.     

 

ముహూర్తానికి అబ్బాయి లేటుగా వస్తే కాసేపు ఆగాలి కాని ఇలా ఎవరితో పడితే వారితో తాళి కట్టించుకుంటారా అంటే.. వరుడు చేసిన పనికి ఆమె కోప్పడి ఇలా చేసిందని తెలుస్తుంది. అయితే వరుడు కావాలని లేటుగా రాలేదట అతన్ని రూమ్ లో ఎవరో బందించారట.. ఇదంతా కావాలనే అమ్మాయి తరపున వాళ్ళు చేయించారని వరుడు తరపున వారు పోలీస్ కంప్లైట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి విషయాన్ని కనుక్కుని ఆ తాళి కట్టిన వాడితోనే అమ్మాయిని ఇచ్చి పంపించారు.  

 

పెళ్లి ఒకడిది అయితే పెళ్లి కూతురు మాత్రం వేరోకడితో తాళి కట్టించుకుని సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ లోని బిజినూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ విషయంపై వధువు మీదే అందరు డౌట్ పడుతున్నారు. అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేకనే అలా చేసి ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు పెళ్లి మండపంలో అమ్మాయికి తాళి కట్టిన వ్యక్తి ఆమెకు ఇదివరకే పరిచయం ఉన్న వాడా కాదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి తన పెళ్ళికి తానే గెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ వరుడికి.. పాపం ఇప్పుడు ఆ వరుడి పరిస్థితి ఏంటో మరి. తెలిసిన వారు తెలియని వారు అడిగి మళ్ళీ మళ్ళీ అడిగి ఆ వరుడి పరువు తీస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: