మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ మొన్నటి వరకు సాగిన మహారాష్ట్ర రాజకీయ హైడ్రామాపై పలు కీలక విషయాలను వెల్లడించారు.తాము ఎన్సీపీ నేత అజిత్ పవార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం సంప్రదించలేదని తెలిపారు. తాము ఎటువంటిపార్టీ చీల్చివేతకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడలేదని అన్నారు. ఫడ్నవిస్ తొలుత తమ వద్దకు అజితే వచ్చి.. తనతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఒప్పించినట్లు పేర్కొన్నారు.
అంతేకాదు అజిత్ ఈ తతంగమంతా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు చెప్పే చేస్తున్నానని కూడా చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే శరద్ అప్పుడున్న పరిస్థితిల్లో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చక్రం తిప్పారని, అజిత్ డ్రామా వెనుక ఆయన హస్తం ఉందని ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు. ఫడ్నవిస్ ఆదివారం ముంబైలో ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘అజిత్ను ఎన్నికల తరువాత మేం సంప్రదించాం అనేది అవాస్తవం. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు అజిత్ మా వద్దకు వచ్చారు. ఆయనతో పాటి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం కూడా ఈ క్రమంలోనే చేశాం. కానీ ఏమైందో ఏమో తెలీదు అజిత్ 24 గంటల్లోనే మాట మార్చారు. తనేమీ చేయలేనని చేతులెత్తేశారు. దీన్నిబట్టి ఇదంత శరద్ పవార్ అడిన రాజకీయ నాటకంగా తర్వతా మాకు అర్థమవుతోంది.
శరద్ను ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సమయంలో కలిసి పనిచేద్ధాం అని మొదట్లో ఆహ్వానించాం. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన మాకు రాలేదు. శరద్ ఈ భేటీ గురించి అయనకు అనుకూలమైన కొన్ని విషయాలను మాత్రమే బహిర్గతం చేశారు. కానీ ఆయన చెప్పాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడే నేనే వాటిని బయటపెడతా. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్సీపీ, కాంగ్రెస్తో భేరాలకు మాత్రమే శివసేన దిగింది. మరాఠ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్దం’ అని అన్నారు.