కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం శనివారం కాశ్మీర్ సమస్య మరియు ఉల్లి ధరలను పెంచడంపై కేంద్రం పై విరుచుకుపడ్డారు మరియు బిజెపి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేస్తుందని  ఆరోపించారు. తాను  ఒత్తిడికి గురికావడం లేదు అని  అధికార బిజెపిలో చేరడం లేదని అయన అన్నారు.

 

 

 

కాశ్మీర్ లోయలోని 75 లక్షల మందికి స్వేచ్ఛ నిరాకరించబడింది,  ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ నిరాకరించబడితే, అది ప్రజలందరికీ  స్వేచ్ఛ  నిరాకరించడం అని చిదంబరం పేర్కొన్నారు.  స్వేచ్ఛను వేరు చేయలేము, మీది నాది, నాది మీది, నేను మీ స్వేచ్ఛను కాపాడుకోకపోతే, మీరు నా స్వేచ్ఛను  రక్షించలేరు  అని అయన పేర్కొన్నారు.

 

 

 

 

తిహార్ జైలులో , సిబిఐ  మరియు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో 106 రోజుల  ఉన్న తరువాత, ఇడి దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో డిసెంబర్ 4 న  చిదంబరం విడుదల అయ్యారు.

 

 

 

 

జైలు నుండి విడుదలైన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు   ఘన స్వాగతం పలికారు.  చిదంబరం విలేకరులతో మాడ్లాటుతూ,  ఈ దేశంలో, ఒక మితవాద ప్రభుత్వం  ప్రజల స్వేచ్ఛను స్వాధీనం చేసుకునే  ఫాసిస్ట్ రకం ప్రభుత్వం వైపు కదులుతోంది ... మేము చాలా అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు.  వార్తాపత్రికలు రాయకూడదు, టెలివిజన్ చానెల్స్ చర్చించకూడదు,  రాజకీయ నాయకులను (ప్రత్యర్థులను) విమర్శించడానికి అనుమతించకపోవడం ఇవన్నీ వ్యక్తి స్వచ్ఛ అధికారాలను హరించే  అధికార పార్టీ లక్ష్యాలు అని అయన పేర్కొన్నారు.  జవహర్‌లాల్ నెహ్రూతో సహా స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల జైలు శిక్షతో పోల్చినప్పుడు  106 రోజుల జైలు జీవితం గడపడం  పెద్దది కాదని  నేను నా జైలు శిక్షను సంతోషంగా అంగీకరిస్తున్నాను, అని అయన  చెప్పారు.

 

 

 

75 లక్షల కాశ్మీరీలకు బిజెపి స్వేచ్ఛను నిరాకరించింది అని , బీజేపీ ప్రభుత్వం కాశ్మీరీ  ప్రజల స్వేచ్ఛ హక్కును హరించడానికి ప్రయత్నిస్తుందని చిదంబరం పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: