ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు పది రోజులపాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. 20 ప్రధాన అంశాలపై సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వ రంగం సిద్దమైంది. 3 నుంచి 5 బిల్లులు ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. తొలిరోజున ‘దిశ’ హత్యోదంతంపై చర్చ తరువాత కీలకమైన బిల్లులు సభలో ప్రవేశ పెట్టనున్నారు. 


అధికార ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ సమావేశాలకు సిద్దమయ్యి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వినూత్నంగా నిరసన తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో ఉల్లిపాయ దండలతో అసెంబ్లీకి వచ్చారు. ప్లకార్డులతో నిరసనను తెలిపారు. అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఉల్లి దండలు, ప్లకార్డులకు అనుమతి లేదని చెప్పడంతో అక్కడి పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యేల వాగ్వాదం జరిగింది. 


మొదటి రోజు సభ ప్రారంభం అయ్యాక ప్రశ్నోత్తరాలు ముగిసాక బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలి అనేది చర్చిస్తారు. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ... ప్రభుత్వం చేసిన చట్టంపై మరోసారి సభలో చర్చ జరుగుతుంది. సుమారు 20 అంశాలపై సభలో చర్చించ డాని కి ప్రభుత్వం రెడి అవుతోంది. పాఠశాల విద్యలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. ప్రభుత్వ, ప్రైవేటుపాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి 20అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష తెదేపా కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. 


21 అంశాలు సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధాని అమరావతి, ఇసుక ఇంగ్లీష్ మీడియం తో పాటు రాష్ట్రం లో శాంతి భద్రతల అంశాన్ని టీడీపీ ప్రస్తావిస్తూ చర్చ జరగాలని సూచిస్తుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కూడా హీట్ పుట్టించనున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కి దూరంగా ఉన్నారు... మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మరే ఆలోచన లో ఉన్నారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు లో మాఫియా పెరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేయడం సీఎం జగన్ సీరియస్ అవ్వడం జరిగిపోయాయి. దీంతో అసెంబ్లీ లో వీరి వైఖరి ఎలా ఉంటుంది అని చర్చ జరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: