చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. అయితే ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. అయితే వారిని కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. 

 

అయితే ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. అయితే ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు చేసుకున్నారు. 

 

కాగా ఈ ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని హైకోర్టులో మహిళా, పౌరహక్కుల సంఘాల నేతలు పిటిషన్ దాఖలు చెయ్యగా నేడు విచారణ జరిపిన కోర్టు మళ్ళి వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దిశ అత్యాచారం జరిగిన రోజు ఎం జరిగిందే అనేది వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. అయితే దిశ కేసు నిందితులను ఈ వీడియో ఆధారంగానే పోలీసులు ఛేదించి నిందితులను గుర్తించారు. నవంబర్‌ 27వ తేదీన రాత్రి 10.28 గంటల సమయంలో తొండూపల్లి టోల్‌గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్‌గేట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.

 

అత్యాచారం జరిపి హత్య చేసి ఆమె శరీరాన్ని దుప్పట్లో చుట్టి ఘటనా స్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లారు. ఆలా తీసుకెళ్లి దిశపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి పారిపోయారు. ఇలా లారీలో మృతదేహాన్ని తీసుకువెళుతుండగా ఆ దృశ్యం తొండూపల్లి టోల్‌గేట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. నిందితుల లారీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: