రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దారుణ మారణకాండ దిశ హత్యాచార ఘటన. ఒకమనిషి ఇంత కౄరంగా ఆలొచిస్తున్నాడు  అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది కూడ ఈ సంఘటనే.. ఇకపోతే తాజాగా నవంబర్ 27న రాత్రి 9.30 గంటల సమయంలో ఒంటరిగా కనిపించిన వెటర్నరీ వైద్యురాలిని అపహరించి దారుణంగా అత్యాచారం చేసి, అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు ఆమె మృతదేహాన్ని తర్వాత లారీ క్యాబిన్‌లోకి ఎక్కించి తరలించారు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో క్లీయర్‌గా రికార్డయ్యాయి.

 

 

తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో దిశపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులు ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేసి, చటాన్‌పల్లి వంతెన కింద నవంబర్ 28 వేకువ జామున 2, 3 గంటల సమయంలో దిశ మృతదేహాన్ని పెట్రోలు పోసి దహనం చేశారు. కాగా దహనం చేయడానికి అవసరమైన పెట్రోలును ఓ పెట్రోలు పంపు నుంచి స్కూటీపై వచ్చిన నిందితులు కొనుగోలు చేశారు.

 

 

అయితే బంకుల్లో ఉన్న సిబ్బంది బాటిల్‌లో పెట్రోలు నింపడానికి నిరాకరించగా అతి తెలివి ప్రదర్శించి తమ వాహనం ఆగిపోయిందని పెట్రోలు సంపాదించారు. ఇకపోతే సీసీటీవీ కెమెరాల్లో ప్రధాన నిందితుడు ఆరిఫ్ (ఏ1), మరో నిందితుడు చింతకుంట చెన్నకేశవులు (ఏ4) దిశ మృత దేహంతో లారీని తీసుకెళ్లగా.. ఏ2, ఏ3 నిందితులు జొల్లు నవీన్, శివ స్కూటీపై లారీని అనుసరించారు. ఆ దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి.

 

 

ఇక సత్యం అనే రైతు ఉదయం 5 గంటల సమయంలో వంతెన సమీపం నుంచి వెళుతూ అక్కడ మంటలను గమనించాడు. కానీ అవి చలి మంటలుగా భావించాడు. తిరిగి 6.30, 7 గంటల మధ్య ఇంటికి వెళ్తూ.. వంతెన కింద కాలిపోతుంది యువతి మృతదేహం అని గుర్తించి, వెంటనే షాద్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక చటాన్‌పల్లి వంతెన కింద మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ తండ్రి అక్కడికి వెళ్లి, ఆ డెడ్ బాడీ తమ కూతురుదేనని గుర్తించారు. దీంతో ఈ సంచలనం వెలుగులోకి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: