వైసీపీలో కాస్త దూకుడుగా వెళుతోన్న ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు గారి గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ర‌ఘురామ కృష్ణంరాజుకు ఇండ‌స్ట్రీలోనూ, పొలిటిక‌ల్‌గాను చాలా ఫ్రెండ్స్ ఉంటారు. పైగా ఆయ‌న చాలా పార్టీలు చేస్తుంటారు. ఈ పార్టీలు అన్ని భారీగా ఉంటాయ‌న్న టాక్ ఉంది. నాగార్జున‌, చిరంజీవి, వెంక‌టేష్‌, మోహ‌న్‌బాబు ఇలా చాలా మందితో క‌లిసి ఆయ‌న చాలా రెగ్యుల‌ర్‌గా పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

 

ఇక ఇప్పుడు ఆయ‌న ఈ నెల 11న ఢిల్లీలో ఎంపీలకు భారీ విందు ఇవ్వబోతున్నారు. తన వియ్యంకుడు, మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవిపి రామ‌చంద్ర‌రావు ఇంట్లో ఏర్పాటు చేస్తున్న ఈ విందు వైభోగం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ విందులో పెట్టే ఐటెంల సంఖ్యే 100కు పైగా మాటే అంటున్నారు. గోదావ‌రి రుచుల‌కు విందులో కొద‌వే లేద‌ట‌.

 

స‌మ‌స్త గోదావ‌రి రుజులు కాకినాడ కాజ‌, గోదావ‌రి పుల‌స‌, తాపేశ్వ‌రం ల‌డ్డూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సంప్రదాయ చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో చేసే వంటకాలు, అలాగే స్వీట్లు, హాట్లు, నాటు కోళ్లు, కౌజుపిట్టలు ఇలా ఈ మెనూ చూస్తుంటే విందు ఆరంగించాల్సిందే అంటున్నారు. ఇందుకోసం వాడే సామ‌గ్రినే ఏకంగా రెండు స్పెష‌ల్ ఫైట్ల‌లో ఢిల్లీకి చేర‌వేశార‌ట‌. ఢిల్లీ మీడియా టాక్ ప్రకారం ఆంధ్రా, తెలంగాణ నుంచి భారీ ఎత్తున వంట వాళ్లు అక్క‌డ‌కు చేరుకున్నార‌ట‌.

 

ఇక కేవ‌లం ఒక్కో కిల్లీ రేటు రు.1000 వ‌ర‌కు ఉంటుంద‌ట‌. గోదావరి కవటాకులతో చేసిన ఈ కిళ్లీల్లో వాడే కుంకుమపూవు తదితర సుగంథ ద్రవ్యాల ఖరీదే వెయ్యి రూపాయలు వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఢిల్లీ ఎంపీల‌కు క‌ల‌కాలం గుర్తుండిపోయేలా ఈ విందు ఉంటుంద‌ని.. ఆయ‌న బీజేపీలోకి వెళుతున్నార‌ని.. అందుకే పునాదే ఈ విందు అని మ‌రో టాక్‌.. ?  మ‌రి అస‌లు నిజాలు రాజుగారికే ఎరుక‌..?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: