చంద్రబాబు, లోకేశ్ అంటే చాలు మండిపడిపోయే వైసీపీ నేత రోజా.. మరోసారి వారిద్దరిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఉల్లి సమస్యపై చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతాన్ని ఎండగట్టారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేజీ 25 రూపాయలకే ఉల్లి అందిస్తుంటే.. అందులోనూ చంద్రబాబు రాజకీయం వెదుకుతున్నారని రోజా మండిపడ్డారు. లోకేష్‌కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధపడుతున్నారని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.

 

ఓవైపు మహిళల భద్రతపై చర్చిస్తుంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ చేస్తుందని, మహిళల పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. దిశ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయని, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, లోకేష్‌ ఫోటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. మహిళా భద్రత అంశంపై ఆర్కే రోజా మాట్లాడారు.

 

 

మహిళా భద్రత అంశంపై ఈ రోజు చర్చించడానికి అవకాశం ఇచ్చినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు , స్పీకర్‌కు ధన్యవాదాలు. ఈ రోజు మహిళలందరూ కూడా దిశ సంఘటనతో తల్లడిల్లిపో్యారు. వారి భద్రత గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మొదటిసారి మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ముందుగా సీఎంకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

 

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో దిశను రేప్‌ చేసి, కాల్చేశారంటే..మానవత్వం ఉన్న ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు వైయస్‌ జగన్‌పై నమ్మకం ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ తమ గోడును వినిపించాలని ఉన్నారు. వాళ్లలో ఉన్న భయం, ఆక్రోశం సొంత అన్న లాంటి వైయస్‌ జగన్‌కు వినిపించాలని ఆర్కే రోజా అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: