మనదేశంలో పరువు హత్యలు కొన్ని శతాబ్దాల నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం సమాజంలో ప‌రిస్థితులు మారినా.. కులాలు.. మతాలు మతాల మధ్య గ్యాప్ తగ్గుతున్నా, పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ముంబైలో ఓ పరువుహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన మాట వినలేదని ఆగ్రహంతో కన్నతండ్రే తన కుమార్తెను మార్చాడు. తన కుమార్తెను హత్య చేసి సూట్ కేసులో ముక్కలు ముక్కలుగా పెట్టి తరలిస్తుండ‌డంతో ప‌ట్టు బ‌డిపోయాడు. తన మాట వినలేద‌ని అందుకే తన కుమార్తెను హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ప్రాథమిక విచారణలో అంగీకరించాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

 

ముంబైలోని తిట్వాలాకు చెందిన అరవింద్‌ తివారీ(47) ఒంటరిగా ఉంటున్నాడు. హతురాలు సహా ప్రిన్సీ (22) సహా నలుగురు కుమార్తెలు, భార్య స్వగ్రామం జౌన్‌పూర్‌లో ఉంటారు. ప్రిన్సీ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది. ఈ క్ర‌మంలోనే త‌న కుటుంబానికి సాయం చేసేందుకు ఓ ప్రైవేట్ జాబ్‌లో జాయిన్ అయ్యింది. అక్క‌డ ఉద్యోగం లో జాయిన్ అయిన నాలుగు నెల‌ల‌కే ఓ వ్య‌క్తిని ఇష్ట‌ప‌డింది. అత‌డినే పెళ్లాడ‌తాన‌ని చెప్పింది.

 

ఈ విష‌యం తండ్రికి చెప్ప‌డంతో తండ్రి నిరాక‌రించాడు. కుటుంబం పరువు తీస్తున్నావని తండ్రి వాదించాడు. అయినా ఆ యువ‌తి మాత్రం అత‌డినే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో కోపం ప‌ట్ట‌లేని తండ్రి కుమార్తెను ప‌దునైన ఆయుధంలో హ‌త‌మార్చాడు. అక్కడితో ఆగలేదు. మృతదేహాన్ని మూడు భాగాలు చేసాడు. తలతో సహా రెండు భాగాలను సూట్‌ కేసులో కుక్కి ముంబై సమీపంలోని థానేలో ఆటోలో ఎక్కాడు.

 

అయితే సూట్ కేస్ నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌డంతో ఆటో ట్రైడ‌ర్ నిందితుడిని ప్ర‌శ్నించ‌డంతో అత‌డు ఆటోలోనే సూట్ కేసు వ‌దిలేసి పారిపోయాడు. ఆటో డ్రైవ‌ర్ సూట్ కేసు ఓపెన్ చేసి షాక్ అయ్యి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం తానే చేశానని ఒప్పుకున్నాడు. హతురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన ఇతర భాగాలకోసం విచారణ చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: