నేడు సమాజం ఎటు వెళ్తుందో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగి పోతూన్నాయి. అయితే గుంటూరులో సభ్య సమాజం తల దించుకునే ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమ్మ తర్వాత... వదినను తల్లితో సమానంగా చూస్తారు. కానీ ఈ యుగంలో వావి వరసలు మరచిపోయి అఘాయిత్యాలు పాల్పడుతున్నారు. వదినపై సొంత మరుదులే అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. అండగా ఉండాల్సిన భర్తే వారికి సహకరించాల్సిందిగా ఒత్తిడి చేయడం జరిగింది. దింతో ఆ బాధితురాలి దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసుల్ని ఆశ్రయించింది. తాజాగా గుంటూరులో జరిగిన  ‘స్పందన’ కార్యక్రమంలో తన బాధను తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

 

ఇక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పాత గుంటూరుకు చెందిన బాధితురాలికి 2011లో వివాహం జరిగింది. ఆమె  ఉద్యోగం చేస్తున్న విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సరికి మామ కాళ్లు పట్టాలంటూ కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి చేయడం జరుగుతుంది. దింతో  బాధితురాలు  వాళ్ళను కాదు అని   చెప్పలేక  ఆలాగే చేసేది. కానీ తన మామ కూడా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు అని తెలిపింది బాధితురాలు. 

 

ఇక ఆ తర్వాత ఇద్దరు మరుదులు ఆమెపై అత్యాచారం చేశారు. ఇక మరో వైపు నాలుగో మరిది పాలల్లో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఆమె ఈ విషయాన్ని భర్తకు చెబితే అలా ఇష్టం అయితేనే ఉండు  లేదంటే వెళ్లిపోవాలని భర్త హెచ్చరించడంతో ఆమె షాక్  తింది. ఇక ఆమె వాళ్ళు చేసే  అరాచకాలు భరించలేక వేధింపుల కేసు పెట్టడం జరిగింది. దీంతో నిందితులు ఆమెపై దొంగతనం కేసు పెట్టి  అరెస్ట్ చేయించడం జరిగింది. ఇక మరో వైపు విడాకులు ఇవ్వాలని బెదిరించడం జరిగింది  అని  తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని బాధితురాలు తెలియచేయడం జరిగింది. ఇక బాధితురాలకు నాకు  రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకోవడం జరిగింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: