ఎన్ని చట్టాలు తెచ్చిన  మహిళలపై వేధింపులు.. అత్యాచారాలు.. హత్యలు..ఆగడాలు ఆగడం లేదు.   నేరాలకు పాల్పడుతున్నరు .. ఇలాంటి వారిఆగడాలు కు అడ్డుకుట్ట వేసేందుకు  ఏపీలో జగన్  సంచలన చట్టాన్ని తీసుకొచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. వ్యవస్థలో మార్పునకు.. మహిళలపై.. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా తాము సరికొత్త చట్టాన్ని తీసుకు రానున్నట్లు ఏపీ సీఎం జగన్ చెప్పారు 

 

తాము తీసుకొచ్చే చట్టానికి సంబంధించిన వివరాలు సంచలనంగా ఉండటం గమనార్హం. మహిళలపై అఘాయిత్యాలు చేసి.. రెడ్ హ్యాండెడ్ గా దొరకటమే కాదు.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే కేవలం 21 పని దినాల్లో ఉరిశిక్ష అమలు అయ్యేలా  బిల్లు తేనున్నట్లుగా చెప్పారు. మహిళలు.. చిన్నారులు ఇటీవల జరుగుతున్న ఘటనలు తనమనసు ను  తీవ్రంగా కలిచి వేశాయని .. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో అవసరమైన మార్పులు చేసే ప్ర్తయత్నం లో ఉన్నాం అని తెలిపారు ..

 

బిల్లు గురించి మాట్లాడుతూ అయన ఆసక్తి కరమైన మాటలు మాట్లాడారు .ఇటీవల హైదరాబాద్ లో  26 ఏళ్ల మహిళా డాక్టర్ను టోల్ గేట్కు సమీపంలో రేప్ చేసి కాల్చేసిన ఘటన మనకళ్ల ముందు కనిపిస్తోంది.తీవ్రంగా కలిచివేసింది .మన రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరిగితే మన పోలీసులు ఎలా స్పందించాలి? మనం ఎలా స్పందించాలన్న దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు విన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత అందుకు బాధ్యులైన వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం.

 

  సినిమాల్లో హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే.. అందరం చప్పట్లు కొడతాం సంతోషిస్తాం . సినిమా బాగుందని చెబుతాం. కానీ నిజ జీవితంలో కి వచ్చేసరికి ఎవరైనా  దమ్మున్న వాళ్లు  చేస్తే.. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుతో ఢిల్లీ నుంచి వస్తారు. ఇది తప్పు.. ఇలా జరక్కూడదు.. ఇలా ఎందుకు చేశారు?  అంటూ ప్రశ్నలు ,నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి.ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడటమే ఏ బిల్లు ముఖ్య ఉద్దేశం అని వ్యాఖ్యానించారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: