పెళ్లి అంటే నూరేళ్ల అనుబంధం.. పెద్దల సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట పదికాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దీవిస్తారు పెద్దలు.  కానీ ఈ మద్య భార్యాభర్తల అనుబంధం మాయని మచ్చగా మిగులుతుంది.  వివాహేతర సంబంధాల వల్ల భర్తను భార్య..భార్యను భర్త అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు.  క్షణిక సుఖానికి బానిసలై వివాహబంధానికి అర్థం లేకుండా చేస్తున్నారు.  తాజాగా ఓ భార్య తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి ఏకంగా కొంత మందికి సుపారీ ఇచ్చి మరీ చంపించాలని చూసింది.. కానీ ఆమె వేసిన ప్లాన్ ఆమెకే బెరిసి కొట్టడంతో అడ్డంగా బుక్కయ్యింది.  వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో 15 ఏళ్ల క్రితం తన అక్క కూతురు పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. వాళ్లకు ఇద్దరు కూతుర్లున్నారు.  గత కొంత కాలంగా భర్తపై ఆమె అయిష్టత పెంచుకుంటూ వస్తుంది..దాంతో ఇద్దరి మద్య మనస్పర్థలు రావడం..ప్రతిరోజూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి.  

 

అయితే భర్తపై వ్యామోహం తగ్గడానికి కారణం ఆమెకు అదే ఊరిలో మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడటం. తరచూ అతడిని కలిసేది ఆమె.. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.. అయితే, తమ మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది.. ఎలాగైనా భర్తను అడ్డుతొలగించాలనే నిర్ణయానికి వచ్చారు ఆ ఇద్దరు. ప్రియుడి సలహా మేరకు భర్తను చంపేందుకు గుంటూరుకి చెందిన 9 మందికి సుపారీ ఇచ్చి రప్పించింది.  వారికి రూ.8 లక్షలు అప్పజెప్పింది. అయితే వారు నేరుగా ఆమె భర్తను చంపకుండా ఆయన తినే ఆహారంలో విషం కలపమని ఇచ్చారు.  వారి సలహా మేరకు భర్తకు విషమిచ్చినా అది సక్సెస్ కాలేదు.  దాంతో మరోసారి వారిని సంప్రదించింది భార్య. దాంతో ఆమెకు ఓ పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..  ఆ ఇంజెక్షన్‌ను భర్తను పొడవాలని సలహా ఇచ్చారు.

 

ఆ ఇంజెక్షన్‌ను భర్తను పొడవాలని చూసిన ఆమె ప్రవర్తను చూసి డౌట్ వచ్చిన భర్త.. ఆమెను నిలదీయడంతో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి పరారైంది.  తన భార్య కనిపించడం లేదని పోలీసుల ఫిర్యాదు చేశారు ఆమె భర్త.  రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఫోన్ ఆధారంగా ట్రాక్ చేసి ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా..ఉన్న నిజం చెప్పింది.  ఈ నేపథ్యంలో ఆమెను, ఆమె ప్రియుణ్ని, 9 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: