ఈ మద్య సమాజంలో ఎన్నో సిగ్గుమాలిన పనులు చేస్తు కొంత మంది అడ్డంగా దొరికి పోతున్నారు.  ముఖ్యంగా లైంగిక వాంఛ తీర్చుకునేందుకు సంబంధ బాంధవ్యాలు కూడా మర్చిపోతున్నారు.  అమెరికాలోని నార్త్ కరోలినా ఓ దారుణం జరిగింది.  గురు బ్రహ్మా.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మా అంటూ గురువును దేవుడితో పోల్చారు.  తల్లిదండ్రులు పిల్లను కన్న తర్వాత వారికి విద్యాబుద్దులు నేర్పించే గురువు స్థానమే గొప్పదని పురాణాల్లో చెబుతుంటారు.  కానీ ఈ మద్య కొంత మంది ఆ గురువు స్థానానికి భయంకరమైన మచ్చ తెస్తున్నారు.  విద్యార్థులను లైంగికంగా లోబర్చుకొని శృంగారాలు చేస్తున్నారు.. కొంత మంది పరిక్షలో ఫెయిల్ చేస్తామని బెదిరించి మరీ లోబర్చుకుంటున్నారు.  ఆ మద్య తమిళనాడు లో ఓ పదోతరగతి విద్యార్థితో టీచరమ్మ పారిపోయి పెళ్లి చేసుకుంది.  

 

ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి దారుణాలు..గురువు స్థానానికి మచ్చ తెస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఓ టీచరమ్మ 14 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులకు శృంగార పాఠాలు చెబుతూ అడ్డంగా దొరికిపోయింది.  అసలే ప్రపంచంలో ఫోర్న్ సైట్లతో బీభత్సాలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులకు సెక్స్ ఫిలిమ్స్ చూపిస్తూ.. తరగతి గదిలో సైతం వీరితో రహస్యంగా సరససల్లాపాలు సాగించేది. ముగ్గురు బిడ్డల తల్లి అయిన ఆష్లే.. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను లైంగికంగా లోబరుచుకుంది. అయితే టీచరమ్మ వ్యవహారంపై అనుమానం వచ్చిన స్కూల్ కి చెందిన ఓ వ్యక్తి యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లాడు.  

 

దీనిపై విచారణ జరిపిన యాజమాన్యం ఆష్లే తప్పు చేసినట్లుగా నిర్ధారించుకుని.. స్థానిక కౌంటీ విచారణ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆష్లేను అదుపులోకి తీసుకుని విచారించగా, ఇద్దరు బాలురకు అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపినట్లుగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేసి..  కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా, సభ్య సమాజం తలదించుకునేలా చేసిన టీచరమ్మ వ్యవహారంపై తల్లిదండ్రులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: