ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు 2004కు ముందు అధికారంలో ఉన్నప్పుడు బంట్రోతుకైనా బిడ్డనిస్తాం గానీ రైతు కుటుంబానికి పిల్లనివ్వమని అనేటువంటి రోజులుండేవని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. స్వయంగా చంద్రబాబే తన మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం శుద్ధ దండగ అని రాసుకున్నాడన్నారు.

 

రాష్ట్రంలోని 70% రైతు కుటుంబాలు అల్లాడిపోయినటు వంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని సరిదిద్ది రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. తర్వాత మరల వైయస్ జగన్ గారు రాజశేఖర్ రెడ్డిగారి పరిపాలన గుర్తుకు తెచ్చే విధంగా రైతులకు అండగా నిలుస్తున్నారని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

 

ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చిన పాలన వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిదని మెచ్చుకున్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి . రైతు కుటుంబాలకు చెందిన 4457732 మంది, కౌలు రైతులకు సంబంధించి 1,24,773 మంది మొత్తంగా 4582505 కుటుంబాలకు రూ.5230 కోట్ల రూపాయిలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఓ వ్యక్తి ఏదైనా పని చేస్తే అది చరిత్రలో అజరామరంగా నిలిచిపోయేలా చేయాలి. వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఓ పథకాన్ని ఆలోచన చేసారంటే అది గతంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి గొప్ప ఆలోచనే అయ్యుంటుందని ప్రశంసించారు కాకాణి గోవర్థన్ రెడ్డి.

 

భవిష్యత్ లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే వాటిని తీసివేసే ఆస్కారం లేనటువంటి పథకాలను సీఎం ప్రవేశపెట్టారి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఇలాంటి గొప్ప పథకాలు ప్రవేశ పెట్టినందుకు అధికారపార్టీ శాసనసభా పక్ష నేతగా ఎంతగానో గర్విస్తున్నానన్నారు. జగన్ ది రైతు పక్షపాత ప్రభుత్వమని మెచ్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: