ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు తనపై కావాలనే బురద జల్లుతున్నారని.. కావాలనే ఆంధ్రజ్యోతి పత్రికలో తనపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజ‌ధాని అంశంలో త‌న వ్యాఖ్యల‌ను ప్రతిప‌క్షం వ‌క్రీకరించి మాట్లాడుతుంద‌ని మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అమ‌రావ‌తి ప‌ర్యట‌న‌పై ఓ విలేక‌రి అడిగిన ప్రశ్నకు స‌మాధానం చెబితే.. దాన్ని ప్రతిప‌క్షం, ప‌చ్చమీడియా రాద్ధాంతం చేస్తున్నాయ‌ని బొత్స అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మూడు పంట‌లు పండే భూమి ఇప్పుడు చూస్తే శ్మశాన‌ వాటిక‌ను త‌యారు చేసిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రూ. ల‌క్షా 9 వేల కోట్లతో అభివృద్ధి చేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పి.. ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సుమారు రూ. 840 కోట్లు క‌న్సెల్టెంట్ల‌కు ఎంఓయూలు చేశారని.. దీని ద్వారా రూ.320 కోట్ల ప్రజాధ‌నాన్ని దుర్వినియోగం చేశాడని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

 

యద అందాలన్నీ బయటికే కనిపిస్తుంటే.. ఇంకా ఆ టాప్ ఎందుకు యాషికా..?

 

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకొని అమ‌రావ‌తికి వ‌స్తాడ‌ని విలేక‌రి అడిగిన ప్రశ్నకు స‌మాధానం చెప్పాన‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ గుర్తు చేశారు. త‌న మాట‌ల‌ను ఆంధ్రజ్యోతిలో చంద్రబాబే వ‌క్రీక‌రించి రాయించి దానిపై రాద్ధాంతం చేస్తున్నాడ‌ని మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 

 

అంతే కాదు.. రాజ‌ధాని విష‌యంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ అన్నారు. అమరావ‌తి న‌గ‌రం, ల్యాండ్ పూలింగ్‌లో రైతుల‌నుంచి తీసుకున్న భూముల‌ను డెవ‌ల‌ప్‌మెంట్ చేసి ప్లాట్లు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నామ‌న్నారు. త్వర‌లోనే అంద‌జేస్తామ‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: