తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక లోగోను ఆవిష్కరించారు ఇంతకీ ఆ లోగో దేనికి సంబంధించిందని అనుకుంటున్నారు ..... మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర విత్తనాలకు సంబంధించిన బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.  మంత్రి నిరంజన్‌ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ... నాణ్యమైన వితనోత్పతికి  ప్రభుత్వపరంగా ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని రకాల సానుకూలంగా ఉన్న తెలంగాణ నేలపై మరెన్నో అద్బుతాలు సృష్టించాలని అన్నారు.

 

అంతేకాదు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మనం పండించిన నాణ్యమైన విత్తనాలు ఎక్కడ దొరకవు ,ఇక తెలంగాణ ఉత్పత్తి చేసే విత్తనాలకు మంచి డిమాండ్ ఉందని, అంతేకాక ఇతర దేశాలకు ఈ నాణ్యమైన విత్తనాలను  ఎగుమతి చేస్తున్నాము ఇక ముందు ముందుకి ఎగుమతులు మన తెలంగా నుండి పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు.అంతేకుండా మంత్రి నిరంజన్ రెడ్డి  తాను కేవలం మంత్రి మాత్రమే కాదని.. ఒక విత్తన రైతు కూడా అని మరొక్కసారి గుర్తుచేసుకొని ఈ సమావేశంలో ఆయన చెప్పుకొచ్చారు.

 

నిజానికి  విత్తనాల ఉత్పత్తికి అవసరమైన అన్నిరకాల సానుకూలతలు ఉన్న కారణంగానే తెలంగాణ రాష్గ్రంలో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తిలో  మరింత ముందుకెళ్లి ప్రపంచానికి రాష్ట్రం పేరు తెలిసేలా చేయాలన్నారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి క్రాప్ కాలనీలతో వ్యవసాయాన్ని బలోపేతం, అభివృద్ధి చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని  పేర్కొన్నారు. 

 

అంతేకాదు మార్కెట్లో మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉందని,  రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. మొక్కజొన్న వినియోగం పౌల్ట్రీ పరిశ్రమలో  ప్రధానమైనదని తెలిపారు.  అదేవిధంగా మసాల దినుసులకు సంబంధించిన విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్‌లో పదకొండు సెంటర్లు పెట్టి ఉల్లి అమ్ముతున్నామని, రైతులకు ఉల్లి వితనోత్పత్తిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: