క్రైస్త‌వ మ‌త ప్రబోధ‌కుడు, రాజ‌కీయ నాయ‌కుడు కేఏ పాల్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సినిమాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్దికాలంగా ఈ సినిమాపై విరుచుకుప‌డుతున్న వ‌ర్మ‌..తాజాగా మ‌ళ్లీ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా కేఏ పాల్ యూఎస్ నుండి స్కైప్‌లో మాట్లాడారు. రాంగోపాల్ వర్మ  తీసిన  `అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టె విధంగా ఉంద‌ని పాల్ ఆరోపించారు. అంతేకాకుండా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల సీఎంలైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గురించి సైతం పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 

ఎర్ర‌గ‌డ్డ మెంట‌ల్ ఆస్ప‌త్రిలో...మంత్రి ఈటల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

 

త‌న పేరుని కూడా వాడుకోలేని దుస్థితి రాంగోపాల్ వర్మది అని కేఏ పాల్ ఆరోపించారు. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు   `అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సినిమాలో కొన్ని పాత్ర‌లు మార్చి సినిమా సెట్ చేశాడని ఎద్దేవా చేశారు. `రాం గోపాల్ వర్మ నోరు విప్పితే అబ‌ద్దాలే.. దేవుడి, నా క్షమాపణ కోరితే మంచిది..ఇప్పటికైనా దేవుని దయ ఆయనపై  ఉంటే మంచి సినిమాలు చేస్తే మంచిది. ఇలాంటి పిచ్చి సినిమాలు తీయకపోతేనే మంచిది..`` అని పాల్ సూచించారు. `అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. నెల రోజుల నుండి ఇక్కడే ఉన్నాను...నాకు పబ్లిసిటీ అవసరం లేదు. ప్ర‌పంచ శాంతి కోసం తిరుగుతున్నాను... బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నాతో మాట్లాడారు.` అని కేఏ పాల్ పేర్కొన్నారు. 

 

ర‌క్తం మ‌రిగిపోయేలా తెలంగాణ‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు...జ‌గ‌న్ దిశ చ‌ట్టం..కేసీఆర్ షాక్‌...
 

త‌న‌కు చీప్ పబ్లిసిటీ అవసరం లేదని కేఏ పాల్‌ పేర్కొన్నారు. ``నేను ఎన్నికలను మార్చి లో బహిష్కరించాను. అప్పులు చేస్తున్న ఇరు రాష్ట్రాల సీఎం అభివృద్ధి చేయటం లేదు..వారు కోరితే వేల కోట్లు లాభం వచ్చేలా చేస్తా.` అని తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు కేఏ పాల్ అనూహ్య‌మైన ఆఫ‌ర్ ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: