మొన్న శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం మరియు హత్య నిన్న దిశ హత్య ఇలా చెప్పుకుంటూ పోతే బయటికి వచ్చినవి కొన్ని అయితే బయటపడనివి ఎన్నో అలాంటి సంఘటనలు ఒకటి తరువాత మరొకటి గా ఎక్కడపడితే అక్కడ  బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు  రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ డంప్ లో ఇసుక కోసం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బుక్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి తనకు ఇచ్చిన సమయానికి తన పనివారితో కలిసి ఇసుక త్రవ్వకాలు మొదలు పెట్టారు.

ఇసుక తొవ్వుతున్న సమయంలో ఆ  వ్యక్తికి అందులో మనిషి పుర్రె రావడం తో కలకలం రేపింది.  ఆ ఇసుక  తవ్వి తన స్థలానికి చేరిన తర్వాత తవ్విన స్థలంలో  గమనించగా అందులో అస్థిపంజరం తలభాగం కనిపించింది.  దీంతో అనుమానం వచ్చి వాగు లోకి  వెళ్లి అందులో పరిశీలించగా ఓ అస్థిపంజరం ఉన్నట్లు గుర్తించాడు.  ఇసుకలో చేయి భాగం ఓ చోట, మరో ఎముక భాగం ఓ చోట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చేతి ఎముకకు ఉన్న గాజుల ఆధారంగా ఆ అస్థిపంజరం ఓ మహిళ ది అని తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్బీ నగర్ ఇంచార్జ్ డీసీపీ యాదగిరి ఘటన స్థలాన్ని  పరిశీలించగా ఆ ఇసుకలో మహిళ చీర కూడా కన్పించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి కేసులు ఇంకెన్ని బయటపడతాయి అని ఆందోళన చెందుతున్నారు. ఈ స్త్రీ ఎవరని దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహానికి సంబంధించిన ఆధారాలేవి గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులకు ఈ కేసు కష్టంగా  మారింది.ఈ ఇసుకను కొన్ని నెలల కిందట మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చి డంప్ చేసినట్లు తెలుస్తుంది. ఇసుకతో పాటు మృతదేహం కూడా అప్పుడే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: