తెలంగాణలో దిశ కేసు మరచిపోక ముందే.. మరోసారి అదే తరహా దారుణం యూపీలో చోటు చేసుకుంది. దిశ కేసులో నలుగురు కామాంధులు రెచ్చిపోతే.. ఇక్కడ ఒక్కడే ఆ దారుణానికి ఒడి గట్టాడు.. దిశ కేసు తరహాలోనే .. అత్యాచారం తర్వాత ఆమెకు నిప్పు పెట్టేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపుర్‌ జిల్లా బాందాలో జరిగిందీ దారుణం..

 

18 ఏళ్ల యువతిపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెకు నిప్పు అంటించాడు. దిశ కేసులో బాధితురాలు చనిపోతే.. ఇక్కడ పరిస్థితి ఇంకా దారుణం.. అమ్మాయి 90 శాతం గాయలతో బతికింది. నిత్యం నరకం అనుభవిస్తోంది. దిశ విషయంలోనూ ముక్కూ మొహం తెలియని వాళ్లు అత్యాచారం చేస్తే... ఈ యూపీ దిశ విషయంలో రేప్ చేసింది మాత్రం దూరపు బంధువే.

 

ఇంట్లో బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో బంధువునంటూ దరిజేరిన ఆ రాక్షసుడు.. 18 ఏళ్ల యువతిపై దారుణానికి ఒడి గట్టాడు. ఆ విషయం ఎక్కడ అందరికీ చెప్పేస్తుందో ఏమో అని భయపడ్డాడో ఏమో.. ఆ దారుణం బయటకు రాకుండా ఆమెను అంతం చేయాలని చూశాడు. కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. అక్కడి నుంచి పరారయ్యాయాడు. మంటల బాధ భరించలేక ఆమె చేసిన ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు స్పందించారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి

 

బాధిత యువతికి, నిందితుడు తెలుసునని, రెండు కుటుంబాల మధ్య శుక్రవారం జరిగిన పంచాయితీలో వారిద్దరికీ పెళ్లి చేయాలనే ప్రతిపాదన వచ్చిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఈ కోణంలో వారుప విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. మరి ఆమెతో పెళ్లి ఇష్టం లేక ఇలా చేశాడా.. లేక.. ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు.. ఉన్నావ్ లో ఓ అత్యాచార బాధితురాలిని నిందితుడు ఇలాగే నిప్పుపెట్టి చంపిన సంగతి తెలిసిందే. దీంతో యూపీలో అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: