నిరుద్యోగులకు ఈ మధ్యకాలంలో శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రంలో ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతున్నాయి. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేలోను పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

                     

బిలాస్‌పూర్ ప్రధాన కార్యాలయంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 జనవరి 2020గా పేర్కొంది. 

                           

ఈ సంస్థ పేరు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్‌పూర్.. ఇందులో గ్రూప్ సీ పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో 26 పోస్టులు ఉన్నాయి. కాగా ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దరఖాస్తుకు చివరి తేదీ 13 జనవరి 2020. ఈ పోస్టుకు విద్యార్హతలు 12వ తరగతితో పాటు ఐటీఐ చేసి ఉండాలి. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు అయి ఉండాలి. 

 

ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ద్వారా ఉంటుంది. కాగా ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఏమి లేదు. ఈ పోస్టుల ముఖ్యతేదీలు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 14 డిసెంబర్ 2019 దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 జనవరి 2019 మరిన్ని వివరాలకు ఈ లింక్ ప్రెస్ చెయ్యండి. https://secr.indianrailways.gov.in/

మరింత సమాచారం తెలుసుకోండి: