ఇటీవల హైదరాబాద్ లోని తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతం వద్ద లేడీ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని నలుగురు నీచులు ఎంతో ప్లాన్ ప్రకారం అటకాయించి, ఆపై ఆమెపై బలాత్కారం చేసి హత్య చేసిన ఘటన మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్ని ప్రభుత్వాలు మరియు ఎందరు నాయకులు వస్తూ, పోతూ వున్నా మన దేశంలో ఆడదానికి మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా అభం శుభం తెలియని అమ్మాయిలను కొందరు మృగాళ్లు ఎంతో కిరాతకంగా క్షణిక సుఖం కోసం అత్యాచారం చేసి చంపేస్తున్న ఘటనలకు అడ్డుకట్ట మాత్రం పడడం లేదని పలు ప్రజా మరియు మహిళా సంఘాల వారు వాపోతున్నారు. 

 

ఇక ప్రియాంకను ఎంత క్రూరంగా హింసించి చంపారో అనే ఘటనను తల్చుకుంటుంటే గుండె తరుక్కుపోతోందని, అంత ఘోర కలికి పాల్పడిన ఆ నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు ప్రజలు మరియు ప్రముఖులు కోరడం జరిగింది. అయితే ఆ ఘటన జరిగిన కేవలం పది రోజుల్లోపే పోలీసులపై తిరగగబడి తప్పించుకోబోయిన నిందితులను పోలీసులు స్పాట్ లో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. కాగా ఆ వార్త విన్న దేశ ప్రజలు అందరూ కూడా విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. 

 

కాగా ప్రియాంక ఘటన కేసులో అత్యంత కీలకంగా మారనున్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, అనగా ఫోరెన్సిక్ నిపుణులు సీల్డ్ కవరు లో అందించిన కీలక రిపోర్ట్ లో అన్ని వివరాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంకను బ్రతికి ఉండగానే వారు పెట్రోల్ పోసి చంపేసారా అనే విషయమై కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండడంతో, ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అదే కనుక నిజమని తేలితే ఆ నీచులను మాత్రం ఎన్నిసార్లు శిక్షించినా తప్పులేదని, ఎందుకంటే ఆమెపై ఘోరంగా అత్యాచారం చేయడంతో పాటు, బ్రతికి ఉండగానే ఆమెను కిరాతకంగా చంపేయడం దారుణాతి దారుణం అని పలువురు ప్రజలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు.......!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: