ప్రేమ పేరుతో ఒక మైనర్ బాలికను మోసం చెయ్యడమే కాకుండా ఆమె అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని బాలికను అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన తమిళనాడులోని వేలూరు లో చోటు చేసుకుంది. నివేద (17 సంవత్సరాలు) అనే బాలిక వేలూరు కు చెందిన ఒక చెప్పుల వ్యాపారి కుమార్తె, ఈ నెల 14న ఇంటి నుంచి బయటకి వెళ్లిన తన కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసాడు. 

 

బాలిక తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు జరిపారు, బాలిక కాల్ డేటా ను పరిశీలించిన పోలీసులు చివరిసారిగా ఆమె ఎవరితో మాట్లాడిందో ఆరా తీశారు. ఈ క్రమంలోనే తీర్థగిరి కొండపైన ఉన్న రాళ్ల క్యారీలో ఓ బాలిక మృతదేహం ఉన్నట్లు కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం నివేద గా గుర్తించిన పోలీసులు ప్రియుడు హత్య చేసినట్లు తేల్చారు. 

 

ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన నివేద ఒక ప్రైవేట్ ఆసుపత్రి కాంటీన్లో పనికి కుదిరింది. పనిలో చేరిన మొదటి రోజే ఒక యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమాయణం కొంతకాలం పాటు బానే సాగింది. ఈ నేపథ్యంలో ప్రియుడు బాలికను తీర్థగిరి కొండ దగ్గరకి పిలిచాడు, ఏకాంతంగా మాట్లాడాలని బాలికని పిలిచి కొండ పైనుంచి తోసేసాడు బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఏమీ తెలియనట్లు ఆ దుర్మార్గుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాలిక కాల్ డేటా ఆధారంగా యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బాలిక మరియు యువకుడి మధ్య పెళ్ళికి సంబంధించి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోమని బాలిక కోరగా ప్రియుడు నిరాకరించాడు ఈ నేపథ్యంలో బాలిక తనను మోసం చేసాడని గ్రహించింది, యువకుడు తన విషయం ఎవరికైనా చెప్తుందేమో అని బాలికను కొండపై నుంచి తోసేసి హత్య చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: