ఏపీలో జగన్ సర్కార్ కొత్త జీవో ప్రకారం పింఛన్, రేషన్ కార్డులకు కరెంట్ బిల్లులు, ఆదాయంతో లింక్ పెట్టారని విపక్షాలు ఆరోపణలు  చేస్తున్నాయి.ఏపీలో రేషన్‌కు కొత్త నిబంధనలు తీసుకొచ్చారా.. పింఛన్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చిందా..కరెంట్ బిల్లు ఎక్కువొస్తే పెన్షన్ కట్ అవుతుందా.. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.

 

గతంలో సొంత పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లు మాత్రమే సొంత భవనాల లెక్కలో ఉండేది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో అసలు రేషన్, పెన్షన్ తీసుకున్న అందరి విద్యుత్‌ వినియోగం పరిగణలోకి తీసుకోనున్నారు. ఇటు బీ ఫారాల్లో ఉన్న ఇళ్లు, రోడ్ల పక్కన ఆక్రమించుకొని ఉంటున్న వారు,స్వాధీనాల్లో ఉన్న ఇళ్లు ఈ జాబితాలో చేరతారట. ఇళ్లను అమ్ముకున్న వాళ్లకు, మీటర్ల పేర్లు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉండి ఊళ్లలో ఇళ్లు ఉన్నవాళ్లు కూడా తిప్పలు తప్పేలా లేవు. ఇటు రేషన్‌కు సంబంధించి టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు తప్పితే మరే ఫోర్ వీలర్ లబ్దిదారులకు ఉన్నా.. వారికి రేషన్ కార్డు ఇక లేనట్లే.

 

కరెంట్ బిల్లు 200 యూనిట్లు దాటితే రేషన్.. 300 యూనిట్లు దాటితే పింఛన్ కట్ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అలాగే కుటుంబంలో ఒకరికే పింఛన్ ఇవ్వాలని.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు.. పట్టణ ప్రాంతాల్లో రూ.12 ఆదాయంలోపు ఉన్నవాళ్లకే పింఛన్ ఇస్తారు. అంతేకాదు భార్యాభర్తల ఇద్దరి పేరు మీద ఉన్న సర్వీసులన్నీ కలిపి ఒక యూనిట్‌గా.. గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సర్వీసులన్నింటిని కలిపి ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

 

జగన్ సర్కార్ కొత్త నిబంధనలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందించారు. ప్రభుత్వం డిసెంబర్ 13న 174 జీవోను తీసుకొచ్చిందని.. దీని ప్రకారం పింఛన్‌లకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేసిందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు.. పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలులోపు ఆదాయం.. అలాగే భూమి ఉన్నవాళ్లకు.. యావరేజ్‌గా ఆరు నెలల్లో కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటితే పింఛన్ కట్ చేస్తారన్నారు. అంతేకాదు ఒక కుటుంబంలో ఒకే పింఛన్ ఉంటుందన్నారు.
 
కొద్ది రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వాలంటీర్లు సర్వేలు చేశారని తులసి రెడ్డి చెప్పుకొచ్చారు. 53 లక్షలమంది ఉంటే.. 10లక్షలమంది అనర్హులు అయ్యారని.. జగన్ సర్కార్ మొత్తం 63లక్షలు పింఛన్‌లు చేస్తామని చెప్పి.. మొత్తం 53 లక్షల నుంచి నుంచి 43కు తగ్గించారని.. కడప జిల్లాలో 3లక్షలు ఉంటే 75 వేలు అనర్హులుగా ఉన్నారన్నారు. అయితే ఈ కొత్త నిబంధనల పేరుతో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: