అవును బాబు కలల, ఊహల, గ్రాఫిక్స్ రాజధానిలో జగన్ నిజంగానే అరాచకం చేస్తున్నాడు. అడిగేవాడు ఆపేవాడు ఎవరూ లేకపోవడంతో ఇష్టమొచ్చినట్టుగా మా బాబు గారి కలలోకి వచ్చి ఆయన ఊహల రాజధానిని డిస్టర్బ్ చేస్తున్నాడు. అసలు ఎవరు ఇచ్చారు ఆయనకు ఆ హక్కు ? పదేళ్ళపాటు హైదరాబాద్ లో దర్జాగా ఉండే హాక్కు ఉన్నా మా బాబు గారు ఏపీ మీద ఉన్న ప్రేమతో తట్టా బుట్టా సర్దుకుని కరకట్టకు వచ్చేసాడు. వచ్చి ఊరుకున్నాడా లేదు కదా రాజధాని ఏర్పాటు మీద ఒక కమిటీ వేసాడు. పోనీ ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైనా ఫాలో అయ్యాడా ? అదీ లేదు. అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నాను అంటూ హడావుడిగా ప్రకటన చేసేడు. అంతకు ముందే కొంతమంది తనకు కావాల్సిన వ్యక్తులకు దీనిపై సమాచారం ఇచ్చి భారీగా భూములు కొనిపించాడు. అది వేరే విషయం అనుకోండి.

 

అమరావతి ప్రాంతంలో మూడు పంటలు పాండే నాణ్యమైన భూమిని మేము ఇవ్వము అంటూ అక్కడి రైతులు ఆర్తనాదాలు చేసినా అవసరానికి మించి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని తీసుకుని గ్రాఫిక్స్ లో రాజధాని బొమ్మలు తనకు అనుకూలమైన మీడియాలో పెద్దగా చూపిస్తూ ఇదే ఏపీ రాజధాని అంటూ హడావుడి చేసాడు. అవును ఇప్పుడు ఈ జగన్ వచ్చి తనకు ఎంతో పీటతిష్ఠాత్మకంగా వర్షం వస్తే లోపల ఉన్న వారు కూడా గొడుగులు వేసుకునేలా నిర్మించిన తాత్కాలిక బిల్డింగులు వదిలేసి ఇప్పుడు విసుఖాను రాజధానిగా ప్రకటిస్తాడా ఆ జగన్ ? ఆయన ఎంత ధైర్యం ? 


అమరావతి ప్రాంతంలో సేకరించిన భూముల్లో ఎంచక్కా మా చింతమనేని వంటి వారు గేదెలు మేపుకుంటూ ఉంటే అది ఓర్చలేక ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రకటించి చింతమనేని వారి గెద్దలకు గడ్డి లేకుండా చేస్తాడా ? ఇప్పుడు మళ్ళీ ఆ భూములను సారవంతం చేసి పంటలు, కాయగూరలు, ఆకు కూరలు పండిస్తే ఎలా ? మా బాబు గారి కలల గ్రాఫిక్స్ రాజధాని ఏమైపోవాలి ? అసలు మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయమని ఆ జగన్ కు ఎవరు చెప్పారయ్యా ? ఎవరు ఎలా పోతే ఆయనకు ఎందుకు అంటూ ఓ చంద్రబాబు అభిమాని మాడిపోయిన మసాలా దోస తింటూ జగన్ చేస్తున్న అరాచకాన్ని ప్రశ్నిస్తున్నాడు.     

మరింత సమాచారం తెలుసుకోండి: