పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కు యూత్‌ లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే... కొత్తగా మల్లి చెప్పనక్కర్లేదు.  మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ ఆనందాన్ని అసలు మాటల్లో వర్ణించలేం. హిట్లు ప్లాప్‌‌ లకు అతీతంగా ఆయన ప్రయాణం కొనసాగింది. అలాగే రాజకీయాల్లోనూ ఫలితాలకు అతీతంగా ఆయన ముందుకు వెళ్తున్నారు.


బీజేపీ కి చెందిన ఇద్దరు యువ ఎంపీలు జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఆదివారం కలిశారు. కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరు ఎంపీలు.. పవన్‌ను కలిసి తెగ ఆనంద పడిపోయారు. బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా.. పవన్‌ ను కలిశారు. ఈ విషయాన్ని మైసూరు ఎంపీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


నేను ఆయన సినిమాలను చూసేవాణ్ని. కాలేజీ రోజుల్లో ఆయన్నెంతగానో అభిమానించే వాణ్ని. ఈ రోజు నేను, తేజస్వి సూర్య ఆయనను  కలిసి మాట్లాడే అవకాశం లభించింది. థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ సర్, విశ్వ గారూ’’ అని ప్రతాప్ సింహా ట్వీట్ చేశారు. ఈ భేటీలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారని ఫొటోలను బట్టి అర్థం అవుతోంది.


బీజేపీ నేతలు తనకు బాగా తెలుసని పవన్ కళ్యాణ్ పదే పదే అంటుంటారు. జగన్ సర్కారు సమస్యల పరిష్కారం పై తగిన రీతిలో స్పందించికపోతే.. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని ఆయన హెచ్చరించారు. మోదీ, అమిత్ షాలకు తనంటే ఎంతో అభిమానం అన్నారు. పవన్ బీజేపీకి దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. కమలం పార్టీకి చెందిన, పొరుగు రాష్ట్రానికి చెందిన యువ ఎంపీలు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: