చంద్రబాబునాయుడుపై వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలకు జేసి దివాకర్ రెడ్డి మద్దతు ఇస్తున్నారా ?  తాజాగా టిడిసి సీనియర్ నేత, మాజీ ఎంపి జేసి చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. రాజధాని పేరుతో  వైసిపి-టిడిపిలు వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నాయంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది.   నిజానికి జేసి చేసిన ఆరోపణలు టిడిపికే వర్తిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఎందుకంటే రాజధాని పేరుతో ఐదేళ్ళ పాటు రకరకాల విన్యాసాలు చేసింది చంద్రబాబే కానీ జగన్ కాదన్న విషయం తెలిసిందే. ప్రపంచస్ధాయి రాజధాని అన్నారు. సింగపూర్ కంపెనీలతో భాగస్వామ్యం అని చెప్పారు. స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మిస్తున్నట్లు నమ్మబలికారు. మొత్తానికి భూములిచ్చిన రైతులను నట్టేటముంచి బినామీలతో వేలాది ఎకరాలను కారు చౌకగా కొనిపించిన చంద్రబాబుకే జేసి ఆరోపణలు తగులుతాయి.

 

ఏదో ఒక్క టిడిపిని  మాత్రమే అంటే బావోదని దోపిడిలో వైసిపిని కూడా చేర్చాడంతే.  ఒకవైపు దోపిడి గురించి మాట్లాడుతునే మరోవైపు దేశంలో ప్రాంతీయ పార్టీల పీడ పోవాలని కోరుకున్నారు. అదే సమయంలో  రాష్ట్రానికి టిడిపి పీడ కూడా పోవాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రాంతీయ పార్టీల వల్ల అవినీతి పెరిగిపోవటంతో పాటు కుటుంబపాలన కూడా పెరిగిపోయిందట.

 

ఇక్కడ కుటుంబపాలన అంటే మళ్ళీ టిడిపినే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు కొడుకు నారా లోకేష్ ను  ప్రమోట్ చేసుకోవటంతోనే సరిపోయింది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దొడ్డి దోవన ఎంఎల్సీ అయిపోయి మంత్రయిపోయారు. లేకపోతే లోకేష్ కున్న తెలివికి ఏ పార్టీ కూడా దగ్గరకు  కూడా చేర్చదన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నే జేసి నేరుగానే చెప్పేశారు.  మొత్తానికి తెలుగుదేశంపార్టీ, చంద్రబాబు, లోకేష్ పై చేసిన తాజా ఆరోపణలు, వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది. మరి చంద్రబాబు ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: